+91 95819 05907

అద్దెకు ఉన్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి

కొత్తగూడెం 2టౌన్ పోలీసులు.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జూన్ 6:

గత 15 నెలల క్రితం అనగా ఫిబ్రవరి నెల 2023లో కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SCB నగర్ నగర్ నందు నివాస ఉండే మనోహర్ బాబు అనే వ్యక్తి తన యొక్క ఇద్దరు పిల్లలు ఒకరు అమెరికాలో మరియు ఒకరు బెంగళూరులో ఉండడంతో వృద్ధ దంపతులు ఇంటి వద్దనే ఉన్నారు.వారి ఇంటి పై భాగంలోని పోర్షన్లో మహావీర్ అనే వ్యక్తి కుటుంబముతో సహా గత నాలుగు సంవత్సరాలుగా అద్దెకు వుంటున్నారు.వీరు అట్టి వృద్ధ దంపతులతో స్నేహంగా, సన్నిహితంగా ఉంటూ వారి ఇంటికి వేసే రెండవ తాళం యొక్క తాళపు చెవిని దొంగిలించి అదనుచూసి వారు ప్రతి రోజు గుడికి పూజకు వెళ్తారని భావించి రాత్రి పూట వారు టెంపుల్ కి వెళ్ళిన సమయంలో వారికి అనుమానం రాకుండా సదరు మహావీర్ ఆ ఇంటి యొక్క తాళం తీసి వారి ఇంటిలోని బీరువాలో ఉన్న సుమారుగా 117 గ్రాముల బంగారు ఆభరణాలైన నక్లెస్ మరియు చైను మరియు నాలుగు గాజులు దొంగిలించి వాటిని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అయితే మనోహర్ బాబు అత్యవసరంగా పని నిమిత్తం తను తన భార్య తెల్లవారు జామునే అమెరికా వెళుతూ వారి ఇంట్లోని నగలు లేకపోవడంతో దొంగతనం జరిగిందని భావించి హాడావిడిలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోవడం జరిగింది.వాళ్లు అమెరికా వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మిత్రుడుకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వమని చెప్పగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఇట్టి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సదరు మనోహర్ బాబుఅమెరికా నుంచి రాగా వారి నుంచి పూర్తి సమాచారం తెలుసుకొని దర్యాప్తు ముమ్మరం చేయగా వారి ఇంటి పైన ఉంటున్న మహావీర్ అనే వ్యక్తి ఆ ఇంటిలో దొంగతనం చేశారని అట్టి వస్తులను ఈ రోజు తను అమ్మడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు చాకచక్యంగా గోధుమ వాగు బ్రిడ్జి వద్ద పట్టుకొని అతన్ని విచారించగా దొంగతనం చేసింది తానే అని ఒప్పుకోగా అతని వద్ద నుంచి ఒక బంగారు ఆభరణాలను రికవరీ చేసి అతని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించడం జరిగింది.ఇట్టి సొమ్ము విలువ 7,60,000/-రూపాయలు ఉంటుందని సిఐ రమేష్ వివరాలను వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !