+91 95819 05907

ఆరోగ్యశ్రీ లో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు…

1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు…

487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 9:

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్,పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స,ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టారని అన్నారు.ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని, వీరికి 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పధకం ద్వారా అందుతుందన్నారు.రాష్ట్రం లో ఈ సదుపాయము 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతుందని,ప్రస్తుతంఈ పధకం లో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని,ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్,పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు.
వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వం పై భారం పడనుంది.
65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo 158.20 కోట్ల ఖర్చు చేయనుంది.
పై సవరణల వల్ల,మరియు కొత్త చికిత్సా విధానాలు చేర్చడం కోసం,ప్రభుత్వం అదనంగా 497.29 కోట్లు మంజూరు చేశారని బట్టి విక్రమార్క తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !