+91 95819 05907

ఈనెల 16న జరిగే IFTU మహాసభను జయప్రదం చేయండి

IFTU జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరు మండల కేంద్రంలో ఈనెల 16న జరిగే మణుగూరు ఏరియా మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మధుసుదన్ రెడ్డి కార్మికులను కోరారు.
ఆదివారం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టియు మణుగూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ,ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు,చట్టాలు సాధిస్తే,ఆ చట్టాలను కార్మిక వర్గానికి వర్తింపజేసి చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలు కల్పించవల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి కార్మికుల శ్రమను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఏ విధమైన హక్కులు లేకుండా కట్టు బానిసలుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,తమ హక్కుల పరిరక్షణ కోసం, మెరుగైన జీవనం కోసం కార్మిక వర్గం పోరాడవల్సిన అవసరం ఉందన్నారు.బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం కోసం జరుగుతున్న ఐ ఎఫ్ టి యు మహాసభలలో భాగంగా ఈ నెల 16న ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా మహాసభ జరుగుతుందని,ఈ మహాసభలో మణుగూరు ఏరియా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బి మల్సూర్, జెల్ల అశోక్,ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి జానయ్య,పి సంజీవరెడ్డి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు,బ్రాంచి కార్యదర్శి పొడుతూరి లక్ష్మీనారాయణ,బ్రాంచ్ నాయకులు పి నరసింహారావు, ఎన్ త్రిమూర్తులు,ఓబీ వర్కర్స్ నాయకులు జే యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !