+91 95819 05907

ఈనెల 16న జరిగే IFTU మహాసభను జయప్రదం చేయండి

IFTU జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరు మండల కేంద్రంలో ఈనెల 16న జరిగే మణుగూరు ఏరియా మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ మధుసుదన్ రెడ్డి కార్మికులను కోరారు.
ఆదివారం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టియు మణుగూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ,ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు,చట్టాలు సాధిస్తే,ఆ చట్టాలను కార్మిక వర్గానికి వర్తింపజేసి చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలు కల్పించవల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి కార్మికుల శ్రమను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఏ విధమైన హక్కులు లేకుండా కట్టు బానిసలుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,తమ హక్కుల పరిరక్షణ కోసం, మెరుగైన జీవనం కోసం కార్మిక వర్గం పోరాడవల్సిన అవసరం ఉందన్నారు.బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం కోసం జరుగుతున్న ఐ ఎఫ్ టి యు మహాసభలలో భాగంగా ఈ నెల 16న ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా మహాసభ జరుగుతుందని,ఈ మహాసభలో మణుగూరు ఏరియా కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బి మల్సూర్, జెల్ల అశోక్,ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు వి జానయ్య,పి సంజీవరెడ్డి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు,బ్రాంచి కార్యదర్శి పొడుతూరి లక్ష్మీనారాయణ,బ్రాంచ్ నాయకులు పి నరసింహారావు, ఎన్ త్రిమూర్తులు,ఓబీ వర్కర్స్ నాయకులు జే యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !