+91 95819 05907

తురకగూడెంలో శిథిలావస్థకు చేరిన దళితుల ఇళ్లు..

★చెయ్యెత్తి నిలబడితే గుడిసె కప్పు అందుతుంది…

★వర్షం వస్తె చాలు సట్లు ,సరవలు పెట్టాల్సిందే..

★మొదటి విడతలో ఇళ్ల కోసం దళితుల ఎదురు చూపు..

★మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ బాధను వ్యక్తం చేస్తూ వేడుకోలు..

నేటి గదర్ న్యూస్ ,జులై 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

పేదోడికి సొంత ఇళ్లు ఒక కల.. ఇల్లు కట్టుకోవడం కోసం తన జీవితాంతం అహర్నిశలు కష్టపడిన ఇల్లు కట్టుకోలేక సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుంది… కొందరు అప్పులు చేసి అయినా కట్టుకోవాలి అనుకుంటారు.. కొంత మందికి ప్రభుత్వాలు ఇల్లు కట్టించి ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తాయి..కానీ సొంత ఇల్లు ఉండి కూడా అవస్థలు పడుతున్న పేదలు ఉన్నారు… వారే కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో దళిత కాలని వాసులు.. వారికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టించి ఇచ్చింది.. ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణ సమయంలో అప్పటి గుత్తేదారు కాసులకు కక్కుర్తి పడి సరైన నాణ్యత లేకుండానే, కనీసం బెస్ మట్టం ఎత్తు , లోపలో సన్నసైడ్ ,ఇంటికి ప్లాస్టింగ్ లేకుండానే కట్టించి పేదలకు కట్టబెట్టారు.. పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి.. ఇప్పుడు ఆ ఇళ్లలో ఉంటున్న ఆ దళితుల పరిస్థితి చెప్పితే గుండె తరుక్క పోతుంది.. శిథిలావస్థకు చేరిన ఇళ్ళల్లో ఉంటున్న వారు బిక్కు బిక్కు మంటూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు మీద పడతాయో తెలియక రాత్రులు నిద్రపోవాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షపు నీటిని పట్టడం కోసం సరవలు , సట్లు పెట్టాల్సిన పరిస్థితి . మనిషి నిలబడి చెయ్యెత్తితే స్లాబ్ అందుతుంది. ఎప్పుడు గోడలు ,స్లాబ్ కులుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు సాగిస్తున్నారు.. దళిత కాలని వాసులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ఇందిరమ్మ ఇళ్ళకు మొదటి విడతలోనే ఈ దళితులకు అందరికీ ఇళ్లులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ వేడుకుంటున్నారు. తమ బాధను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్ళేలా ఒకసారి ఇళ్లను సందర్శించాలని కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !