రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 17:- తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ పథక ఓ గృహ జ్యోతి ఒకటి దాని అమల్లో ప్రభుత్వం మీనా మేషలను లెక్కించడంలో విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకుండా దీన్ని సర్వనాశనం చేసి ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు అని తప్పుల తడకగా తయారు చేశారు.ఎవరైనా వెళ్లి వారి బాధను చెప్పుకోగా ఫలానా పేపర్ లేదు దాన్ని తీసుకొస్తే మీది అయిపోతది అని నమ్మ పలికి వారు తప్పించుకుంటున్నారు. డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీల వద్ద పంచాయతీ సెక్రెటరీ లు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి నిరుపేద ప్రజల విద్యుత్ మీటర్ల సమాచారం తీసుకొని ఇందిరమ్మ గృహ జ్యోతి దరఖాస్తులు అధికారులకు అప్పగించారు.కానీ డిసెంబర్ నుండి ఇప్పటివరకు కాకపోవడం వేలమంది లబ్ధిదారులు అమలు కాకపోవడం దేనికి సంకేతం కాంగ్రెస్ అలవాటే ఇంతేనా లేక ప్రభుత్వ విధానమే ఇంతన అని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.రైతులు ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన పని కాకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఆవేశపడుతున్నారు.అయినా కానీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తప్పులను సరిచేయాలని మండల ప్రజాపరిషత్ లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దాంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్ళగా కంప్యూటర్ ఆపరేటర్ గృహజ్యోతి కి సంబంధించిన అప్లై చేసుకున్న ఫారం చూసి ఇది తప్పులతడకగా రాశారు.ఈ ఫారం చెల్లదు అందుకు తిరిగి ప్రభుత్వం సర్వే చేయాలని కొత్త దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.విద్యుత్ అధికారులు పట్టించుకోని ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోయి వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు కి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్నవారికి వెంటనే ఉచిత విద్యుత్తు వచ్చేలా అధికారులు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.









