+91 95819 05907

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి

నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు

నేటి గదర్ న్యూస్, వైరా :
అమరజీవి కామ్రేడ్ మాడపాటి కమలమ్మ నేటి తరానికి ఆదర్శం అని, నిబద్ధత కలిగిన ఆదర్శ కమ్యూనిస్టు మాడపాటి కమలమ్మ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, ఎర్రజెండా నీడలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం ద్వారా మాడపాటి కమలమ్మకు నిజమైన నివాళులు అర్పించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు అధ్యక్షతన పార్టీ నాయకురాలు మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడపాటి కమలమ్మ చిత్ర పటానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాడపాటి కమలమ్మ స్మారక స్తూపం వద్ధ పార్టీ జెండాను పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు మాట్లాడుతూ మాడపాటి కమలమ్మ తన జీవితాంతం పేద ప్రజల కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని సొంత స్వార్థం లేకుండా పని చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ధైర్యశాలి అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నికరంగా నిలబడి నిరంతరం పోరాడుతున్నది ఒక్క కమ్యూనిస్టులే అన్నారు. నేడు పాలకవర్గాలు ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలు సేవలో మునిగి పోయారని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకు వస్తూ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను ప్రతి కార్యకర్త ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ఊడిగం చేస్తున్నారని, లక్షల కోట్ల రూపాయలు దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. అమేరిక సామ్రాజ్యవాదానికి లొంగీన మోడీ ఇరాన్ పై జరుగుతున్న దాడుల పై కనీసం నోరు కూడా మెదపడం లేదని అన్నారు. గ్యాస్ కొరతతో దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో మాడపాటి కమలమ్మ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ప్రతి కార్యకర్త మాడపాటి కమలమ్మ ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని, అదే ఆమేకు ఇచ్చే నిజమైన నివాళని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేయడమే మాడపాటి కమలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) పార్టీ వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పొధిల హరినాథ్, సిపిఐ(ఎం) నాయకులు కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, 19వ వార్డు కౌన్సిలర్ చింతనిప్పు సులోచన, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సిఐటియూ వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, యనమద్ది రామకృష్ణ,సంక్రాంతి పురుషోత్తమరావు, సంక్రాంతి పుల్లయ్య, అమరనేని కృష్ణ, కర్నాటి బాబురావు, పాసంగులపాటి చలపతిరావు, మాడపాటి కమలమ్మ కుమారులు మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, మాడపాటి శ్రీనాథ్,
మాడపాటి రాజేష్, కమలమ్మ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !