★ మాజీ ఎమ్మెల్యే, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం డిసిసి అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రం లో ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో హైదరాబాద్ లక్షలాది డప్పులు వేలాది గొంతుల కర పత్రాలను ఎక్స్ ఎమ్మెల్యే, పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ పోదెం వీరయ్య గారు ఆవిష్కరించటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పిబ్రవరి 7న హైదరాబాద్ నడి బొడ్డున జరిగే మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శనను ప్రపంచం మొత్తం మాదిగల వైపు చూసే విదంగా చిర్రలు, చిటికెడు పుల్లలతో డప్పులతో హైదరాబాద్ రాజధాని లో ఎన్నడూ జరగని రీతిలో పెద్దలు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుకు మాదిగ, మాదిగ ఉపకులాలు ఎర్రని ఎండలో గుండెమీద డప్పు పెట్టి కొట్టడానికి మాదిగలు సిద్ధం కావాలి అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ కట్టుబడి ఉందని, ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనగారిన కులాల హక్కుల కోసం నిరంతరం తపిస్తుందని అన్నారు. మాదిగ మాదిగ ఉప కులాలు చేసిన న్యాయ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు, భద్రాచలం మండలం ఇంచార్జ్ అలవాల రాజా మాదిగ పెరియార్, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేకల లత, జిల్లా ఉపాధ్యక్షులు కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గొడేటి వెంకటేశ్వర్లు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడారి ప్రదీప్, యూత్ కాంగ్రెస్ భద్రాచలం మండలం ఉపాధ్యక్షుడు పొడుతూరీ ప్రేమ్ సాయి,వరుణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు …