+91 95819 05907

అడ్వకేట్ ఊకే రవి పై దాడికి ప్రయత్నించిన గిరిజనేతరులపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి -ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ

అడ్వకేట్ ఊకే రవి పై దాడికి ప్రయత్నించిన గిరిజనేతరులపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి -ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 06: ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు న్యాయవాది ఊకె రవి పై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ దాడికి ప్రయత్నించడంతో పాటు, ఆయన వాదిస్తున్న కేసులనూ, తన క్లైంట్స్ ద్వారా కేసు వెనక్కి తీసుకోక పోతే ఆత్మ హత్య చేసుకుంటామని డ్రామాలాడుతూ, అశాంతియుత, ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న గిరిజనేతరుల పై వెంటనే ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ కుర్సం బాబురావు, సొందే సుమన్ బాబు, తాటి లక్ష్మణ్, కనితి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జరిగిన సంఘటనపై సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినందున పోలీసు వారు జాప్యం చేయకుండా వెంటనే స్పందించి, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా, కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొంత మంది గిరిజనేతరులు ఏజన్సీ ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి ఆదివాసుల భూములను అన్యాయంగా లాక్కొడమే కాకుండా, తిరిగి ఆదివాసుల పైనే తిరగబడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు అడ్డుకట్ట వేయటానికి న్యాయ బద్దంగా చట్టబద్ధంగా పోరాడుతున్న న్యాయవాది రవి పై అక్కసుతో, కొందరు గిరిజనేతరులు.. “ మీ వల్లనే మా భూములు పోతున్నాయి, మా ఇల్లు కూడా ఖాళీ చేయాలని చెబుతున్నారు అంటూ”.. గిరిజనేతరులు న్యాయవాది రవి – ఇంటి దగ్గరకు వెళ్లి, పురుగుల మందు తాగి చస్తాం అని బెదిరించారని, ఈ విషయంలో ఎందుకమ్మా మీరు వస్తున్నారు, నేను న్యాయం చేయాలి కదా, మీరు వెళ్ళండి అని రవి చెప్పగా వినకపోవడమే కాకుండా, వినిపించకపోయేసరికి స్థానిక ఎస్సై, పాల్వంచ కి ఫోన్ చేసి మాట్లాడిపించడం జరిగినప్పటికీ వారు ఎవరు కుడా చెప్పిన వినలేదని మరియు వాగ్వాదానికి దిగుతూ, వితండవాదంతో, దుర్భాషలాడుతూ తదుపరిగా గ్రామంలో ఉన్నటువంటి నీళ్ల ట్యాంకు ఎక్కి ఊకే రవి లాయర్ వలన మేము చనిపోతున్నాము, మా చావుకు కారణం లాయర్ ఊకే రవి మాత్రమే అని ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ సైతం చేయడం జరిగిందని, గతంలో పాల్వంచ మండలంకు సంబంధించిన ఒక కేసు విషయంలో కూడా గిరిజనులకు గిరిజనేతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని పంచనామ చేసి స్వాధీనం చేయాలని సంబంధిత అధికారులకు కలవగా, అట్టి విషయం మీద కూడా అడ్వకేట్ల పేర్లు రాసి మేము చనిపోతాం మీ వల్లనే మా భూములు పోతున్నాయి అని గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, అప్పుడు స్థానిక పోలీసులకు పాల్వంచ ఎంఆర్ఓ గారికి ఈ విషయం తెలియజేయడంతో, వారికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు నేరుగా ఇంటికి వచ్చి మీ వలన మేము చచ్చిపోతున్నాం పురుగుల మందు తాగి చస్తాం అని బెదిరిస్తూ ఉండే సరికి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగిందని, ఈలోపులో ట్యాంకర్ ఎక్కి దూకి చస్తాము అనే లోపు స్థానిక ములకలపల్లి పోలీసులు వచ్చే నచ్చజెప్పి క్రిందకు దింపి పోలీస్ స్టేషన్కు గిరిజనేతలను తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గిరిజనేతరుల నుండి ప్రాణ హాని ఉన్నందున ప్రభుత్వం వెంటనే తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో అక్రమంగా చొరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనేతరులను వెంటనే మైదాన ప్రాంతాలకు పంపించే ప్రక్రియను ప్రారంభించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !