+91 95819 05907

భారతీయులను అవమానించిన ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

*సంకెళ్లు వేసి పంపిన మౌనమే నా మోడీజీ?*
*ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని,భారతీయులకు రక్షణ కల్పించాలి..*
*వెంకటేష్ పి. డి. ఎస్. యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి*

*ఇండియన్స్ పట్ల అమెరికా అధ్యక్షులు ట్రాంప్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు వినుత్నంగా ట్రాంప్ పేస్ మాస్క్ తో గాల చేతికి సంకెళ్ళతో వేసిన్నట్టు కార్యక్రమం తో పాటు అమెరికా ట్రాంప్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.*

ఈ సందర్బంగా పి. డి. ఎస్. యూ తెలంగాణా రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్,జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ పౌరుల చేతికి సంకెళ్లు వేసి పంపినా ప్రధాని మోడీ మౌనంగానే ఉంటారా? అని కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు.
భారత్ కు అమెరికా మిత్ర దేశమని గొప్పగా చెప్పుకొంటున్న కేంద్రం ప్రభుత్వం? ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంత ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు.అక్రమ వలసదారులంటూ 104 మందిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ భారత్ కు తిప్పిపంపనున్న విషయం కేంద్రానికి ముందే తెలిసి కూడా విశ్వగురు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. ఆమెరికా మాదిరిగానే అక్రమ వలసదారులను భారత మోడీ ప్రభుత్వం కూడా వారిని నేరస్థులుగానే పరిగణిస్తోందా? అని వారిని ప్రశ్నించారు.
వారి లో ఖమ్మం జిల్లాకు చెందిన 14 మంది ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు అటువంటి వారి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ లేకుంటే జీవితలు ప్రశ్నార్థకంగా మారిన కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
విశ్వ గురువుగా చెప్పుకునే (ప్రధాని మోదీ) ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోదీ చాలా మంచి స్నేహితు లని అంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ట్రంప్ తో మాట్లాడలేదు. మన వాళ్లను తీసుకురావడానికి ఒక విమానం పంపలేమా? మనుషులతో ఇలాగే ప్రవర్తిస్తా రా? ” అని నిలదీశారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని భారతీయులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సాదిక్, నసీర్,నిగ్నేష్, రఫీ, అనూష, అఖిల, సంధ్య, స్పందన, సింధు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

మన దునియా ఎడిటర్ ఆత్మహత్యాయత్నం? పోలీసుల వేధింపులే కారణమా?

మీడియా స్వేచ్ఛపై పోలీసు పెత్తనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు! మీడియా గొంతు నొక్కే వ్యవస్థతో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో ధర్మపీఠం (Fourth Estate). కానీ తెలంగాణలో జర్నలిస్టుల పట్ల పోలీసు వ్యవస్థ

Read More »

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

 Don't Miss this News !