+91 95819 05907

వ్యవసాయ కూలీలకు రోజు కూలీ. రూ. 300 చెల్లించాలి

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధికారులను కోరారు. రోజు ఇచ్చే కూలీలో కోత విధించవద్దని ఏడూళ్ల బయ్యారం, ఎల్సిరెడ్డిపల్లి తదితర గ్రామాల వ్యవసాయ కూలీలు నిర్వహిస్తున్న ఆందోళన కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం వ్యవసాయ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 300 రూపాయలు రైతులు చెల్లించే వారని, ఇప్పటి వరకు రైతులు, కూలీలు సమన్వయంతో పని చేసుకునేవారని అన్నారు. వేరే గ్రామాల నుండి మరియు వలస ఆదివాసీలను పోటీగా తీసుకొని వచ్చి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడంతో స్థానిక వ్యవసాయ కూలీలల్లో ఆందోళన మొదలైందని అన్నారు. రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేని వ్యవసాయ కూలీలు ఈరోజు ఉన్న నిత్యవసర సరుకుల ధరల దృష్ట్యా 250 రూపాయలతో ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో ప్రకారమే వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 385 రూపాయలు చెల్లించాలని చెబుతుంది. వారు చెల్లిస్తున్న 300 రూపాయలు కూడా తక్కువే అయినప్పటికీ రాజీపడి వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారని అన్నారు. అది కూడా తగ్గించి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడం సరి అయింది కాదన్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోతే రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై పోరాడాలి. కానీ వ్యవసాయ కూలీల వేతనాల్లో కోత పెట్టడం సరైనది కాదన్నారు. రైతులు పునరాలోచన చేయాలన్నారు. వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. వ్యవసాయ కూలీలు కూడా ఆవేశం తో తొందర పడకుండా ఆలోచనతో, ఐక్యంగా నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

 Don't Miss this News !