మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి
-శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు
-ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు
– ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్
హోళీ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంప్రదాయ రంగులను ఉపయోగించి ఎదుటివారికి ఇబ్బంది కలుగకుండా జరుపుకోవాలని ఈ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ మండల ప్రజలకు సూచించారు. హోలీ పండుగ-2025 సందర్భంగా ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఆయన కొన్ని సూచనలతో హోలీ పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు పోలీస్ శాఖ తరపున సూచనలు , జాగ్రత్తలు చేశారు.14 వ తేదీ హోలీ పండుగ సందర్భంగా సురక్షితమైన రంగులను ఉపయోగించాలని, హానికరమైన రసాయనాలున్న రంగులను వాడవద్దన్నారు.
ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధించబడిందన్నారు.ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని – నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడరాదని ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేయడం తీవ్రంగా నేరంగా పరిగణించబడుతుందన్నారు.
పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధం. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం మరియు చట్టవిరుద్ధం అన్నారు.
ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలను సమూహాలుగా తరలించడం, వీధుల్లో అవాంఛిత రీతిలో తిరగడం అనుమతించబడదన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్లకు కాల్ చేయడం లేదా ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే ఏ చర్య అని కఠినంగా ఎదుర్కొనబడుతుందని,
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు హోలీ పండుగను అందరూ ఆనందంగా, సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరారు.