+91 95819 05907

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్.
– సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం.
– లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ భరోసా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన కొమరం లాస్యశ్రీ కుటుంబానికి బిటిపిఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు అండగా నిలబడ్డారు. చిన్నారి లాస్యశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ లలిత ఇటీవల మృతి చెందడంతో అనాధగా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన కొమరం లాస్యశ్రీ ధీనగాధ విషయం తెలుసుకున్న బిటిపిఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్య శ్రీ కు అండగా నిలిచారు. అతి పేద కుటుంబానికి చెందిన లాస్యశ్రీ తల్లిదండ్రులు మరణంతో, కనీసం అంత్యక్రియలు ఖర్మ కాండలు జరిపించలేని దీనస్థితి. ఈ విషయమై పలు మాధ్యమాల్లో పోస్టింగులు చూసి చలించిపోయిన బీటీపీఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్యశ్రీ కి బాసటగా నిలవాలని నిర్ణయించుకుని, బి టి పి ఎస్ సీఈ బిచ్చన్న కు తెలిపారు. వెంటనే స్పందించిన సి బిచ్చన్న ప్రస్తుత ఖర్చులకు రూ,10 వేలు ఆర్థిక సాయం అందించడమే కాక, చిన్నారి లాస్య శ్రీ ఆరోగ్యం ఉన్నత చదువులకయ్య ఖర్చు మొత్తం బీటీపీఎస్ ఉద్యోగులు భరించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ఔదార్యాన్ని సీ ఈ బిచ్చన్న అభినందించి, కొమరం లాస్యశ్రీ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీ టీ పీ ఎస్ డీ ఈ సత్యనారాయణ, సేఫ్టీ డీ ఈ ఆనంద్ ప్రసాద్, ఏ డీ సత్యనారాయణమూర్తి, బి టి పి ఎస్ ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, ఉద్యోగులు ఆరిఫ్, సభా, అల్తాఫ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !