+91 95819 05907

తెలంగాణలో పీఎంఏవై -జీ వివరాలేంటి ?

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
* గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో.. సర్వే నిలిచిందని.. పేదల కోసం ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. తదుపరి ప్రక్రియ చేపడతామని సమాధానమిచ్చిన కేంద్రమంత్రి

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ( పీఎంఏవై -జీ ) పై కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి.. లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. గత మూడేళ్లలో కేటాయించిన నిధుల వివరాలను అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై -జీ ) పథకం ద్వారా 2016 -17, – 18 ఆర్థిక సంవత్సరాల్లో 70,674 గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి విడతలో రూ.190. 79 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
* గత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదని, దీంతో ఆ ప్రభుత్వానికి నిధుల కేటాయింపు నిలిపివేసినట్లు తెలిపారు.
* ఆ ప్రభుత్వం.. 2018-19 వరకు సర్వేను కూడా నిర్వహించలేనందున.. అర్హులైన కుటుంబాలను గుర్తించలేకపోయారని చెప్పారు.
* ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పీఎంఏవై -జీ అమలుకు సముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అందుకే..అర్హులైన పేదలకు లబ్ధి కలిగేలా.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుందని.. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

అడవులు సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత -ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని

అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదని ప్రతి పౌరుడు బాధ్యతగా అడవులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కోరారు. బుధవారం పినపాక మండలం, కరక గూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో

Read More »

 Don't Miss this News !