+91 95819 05907

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్
– తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది…
– జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి.

నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం, మార్చి 12, : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా అణగారిన వర్గాల సమస్యలపై పోరాడడానికి బలమైన గొంతు శాసనమండలిలో అడుగుపెట్టనున్నదని జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఎస్సీ కోట నుండి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, సోమవారం ఆయన అసెంబ్లీలో నామినేషన్ వేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జాతీయ మాల మహానాడు కమిటీ జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ వెళ్ళి అద్దంకి దయాకర్ ను కలిసి అభినందించి తిరిగి వచ్చిన అనంతరం జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ మేరకు బుధవారం కొత్తగూడెంలో జాతీయ మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకొని అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ పేరును ప్రకటించడం అభినందనీయమని అన్నారు. దశాబ్దాలపాటు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగి ఉన్న అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. నిరంతరం అణగారిన వర్గాల సమస్యలపై పోరాడి తత్వం కలిగిన అద్దంకి దయాకర్ నియామకం ద్వారా అణగారిన వర్గాల బలమైన గొంతు చట్టసభల్లో అడుగుపెట్టనున్నదనే చర్చ అణగారిన వర్గాల్లో వ్యక్తమవుతున్నదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ విధేయతకు మారుపేరుగా నిలిచిన అద్దంకి దయాకర్ ను నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, నాయకులు జెట్టి మోహన్, జంజర్ల కృష్ణ ( జె కే ), మాజీ ఎంపీటీసీ కేడెం రాము, కాటం ఈశ్వరయ్య, బట్టు శ్రీను, గడ్డం కృష్ణ, రామకృష్ణ, గునిగంటి కనకయ్య, వట్టి నారాయణ, బల్లెం జయరాజు, పురుషోత్తం, చుంచుపల్లి మండల అధ్యక్షులు తోకల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !