మహబూబాబాద్: తేదీ 13.02.2025 అనగా గురువారం రోజున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ కిరణ్ గారి సమక్షంలో బహిరంగ వేలం వేయబడుతుంది. ఈ వాహనాలు వివిధ కేసులలో అనగా నల్ల బెల్లం, నాటు సారాయి రవాణా కేసులలో పట్టుబడినటువంటి ద్విచక్ర వాహనాలు కలవు. వేలంలో పాల్గొనదలచిన వారు స్వతహాగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు ఉంచబడినటువంటి వాహనాలను చూసి, బహిరంగ వేలంలో పాల్గొనగలరు. ద్విచక్ర వాహనాలకు వేలంలో పాల్గొనే వారు ₹20 వేలు EMD గా, ఒక్కొక్క వాహనానికి విడివిడిగా గురువారం ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాల్సిందిగా మనవి.
Post Views: 145









