+91 95819 05907

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి…

17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల ధర్నాకు సిపిఎం మద్దతు.

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :మిర్చి రైతులకు మార్కెట్ లో కనీస మద్దతు ధర కల్పించి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని అష్ట గుర్తు గ్రామంలో మిర్చి రైతుల కల్లాలో సిపిఎం నేతలు సుంకర సుధాకర్ తోము సుధాకర్ తో కలిసి పర్యటించారు. మిర్చి రైతులతో మాట్లాడి పెట్టిన పెట్టుబడి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో సరైన రేటు లేక కల్లాలోనే మిర్చి ఉంచామని మద్దతు ధర లేకపోతే కుటుంబాల అప్పుల పాలై మరణాలే శరణం అని రైతు చిత్తారి వెంకటనర్సయ్య రామారావు లు బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర మిర్చి పంటకు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు వెంటనే చేయాలని కోరారు. ఈనెల 17న ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సిపిఎం సంపూర్ణగా మద్దతు ఇస్తుందని తెలిపారు. మిర్చి రైతుల అధిక సంఖ్యలో పాల్గొని మిర్చి రైతుల ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే మిర్చి రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

 Don't Miss this News !