+91 95819 05907

మహిళా దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి ని సన్మానించిన మహిళలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రామాయంపేట మండలం కేంద్రంలో మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న తోటి మహిళా ఉద్యోగులు అందరు కలిసి తహసిల్దార్ రజనీకుమారి ని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి,రేపటి రోజున మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.తాను రామాయంపేట మండల తహసిల్దారుగా 17 ఆగస్టు 2024న మొట్ట మొదటిసారిగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు.గత ఎనిమిది నెలలుగా తన కార్యాలయంలో 17 శాతం మహిళలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలను చిన్నచూపు చూడకుండా పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని తెలిపారు.ఎలాంటి అపోహలకు గురికాకుండా పురుషులు మహిళల పట్ల తన సహోదరిగా భావించి గుర్తించాలని పేర్కొన్నారు.ఆరోజు నా కుటుంబం ఒక మహిళ అని చిన్నచూపు చూడకుండా నా వెన్నంటి ఉండి ఈరోజు వరకు ముందుకు నడిపిస్తేనే నేను ఒక బాధ్యత గల తహసిల్దార్ గా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.అదేవిధంగా నా తోటి మండల సిబ్బంది మహిళలు ప్రజలకు అందించే సేవా కార్యక్రమాల్లో భాగంగా తనకు అన్ని విధాల కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలు ఎలాంటి మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా మహిళలు మున్సిపాలిటీలో గ్రామాలల్లో అనారోగ్యాలకు గురికాకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సుందరకాండ చిరు పుస్తక ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో 56 డివిజన్ స్థానిక విజయనగర్ లో వేంచేసి ఉన్న శిరిడి సాయిబాబా మందిరం లో గురువారం మందిర చైర్మన్ మరియు వాస్తు రత్న డాక్టర్ ఫణిభట్ల రాజ లింగయ్య సిద్ధాంతి జన్మదిన

Read More »

కార్పెంటర్ల బంద్ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి

Read More »

ముస్లింలకు ఈద్గా స్థలం కేటాయించాలి.

◆జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేత. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:- వైరా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర

Read More »

వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి !

స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి !! పనైనా చూపండి – తిండైనా పెట్టండి !!! సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:-మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రత్యేక

Read More »

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

 Don't Miss this News !