ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మేస్త్రీలు , గత కొంతకాలంగా ఎలాంటి ఎదుగూ , బొదుగూ లేకుండా ఉన్నారని , దీనికి కారణం వర్కర్ల రేట్లు విపరీతంగా పెరిగినవి , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి . మన వృత్తికి సంబంధించిన మిషనరీ పరికరాల రేట్లు మనకు అందుబాటులో లేకుండా పెరిగాయి . మనం చేస్తున్నటువంటి పనికి సంబంధించిన మెటీరియల్ రేట్లు కూడా చుక్కల్లో ఉన్నాయి కానీ మనం యజమానుల దగ్గర మాత్రం ఎన్నో ఏండ్ల క్రితం ఉన్నటువంటి రేట్లతోనే కొనసాగుతున్నాం . కరోనా వచ్చిన దగ్గరినుండి చూస్తే ఇవాళ ప్రతీదానికీ రేట్లు పెరిగాయి కానీ మన వృత్తికి సంబంధించిన గత కొన్ని సంవత్సరాలుగా రేట్లు పెరగలేదు . పెరగకపోగా ఉన్న రేట్లనే ఇంకా తగ్గించి ఇస్తున్నారు . మెటీరియల్ కి ఎంత రేటైనా పెట్టి కొంటున్నారు . కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనకు సరైన రేటు ఇవ్వడం లేదు , ఇక్కడ మన శ్రమ ఎంత దోపిడీ జరుగుతుందో మనం గ్రహించి , ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్పెంటర్స్ సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి జె.ఎ.సి.గా ఏర్పడి మన వృత్తికి సంబంధించిన రేట్లని పెంచాలని కలిసికట్టుగా నిర్ణయించడం జరిగిందని , దాని పర్యవసానమే ఈ “బందు” కార్యక్రమం అని అన్నారు . దీనికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మిక సోదరులు సైతం మద్దతిస్తున్నారు . ఇది చాలా మంచి పరిణామం . కావున మన అన్ని సంఘాల కలయికతో ఏర్పడినటువంటి ఈ జె.ఎ.సి. పిలుపునందుకుని ఖమ్మం నగరంలోని ప్రతీ కార్పెంటర్ సోదరుడు ఈ బందులో పాల్గొని జయప్రదం చేసి మన హక్కులను కాపాడుకుందాం , మన యొక్క వృత్తి రేట్లను పెంచుకుందాం , మన జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుందాం , మన కుటుంబాల ఉన్నతికీ , మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేసుకుందాం అని పిలుపునిచ్చారు . ఈ బందును ఉల్లంఘించిన వారికి రూ॥ 10,000/-లు వరకు జరిమానా తోపాటుగా తగు చర్యలు తీసుకొనబడును తెలిపారు . కార్పెంటర్స్ ఇబ్బందులు , బాధలు అర్థం చేసుకుని యజమానులు , బిల్డర్స్ మరియు తోటి కార్పెంటర్లు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ల జేఏసీ ఖమ్మం కన్వీనర్ బాణాల చిన్న వీరబ్రహ్మాచారి , కార్పెంటర్స్ అసోసియేషన్ ఖమ్మం అధ్యక్షులు బాణాల వీరబ్రహ్మాచారి , ప్రధాన కార్యదర్శి సోమా నాగరాజు కుమార్ , కార్పెంటర్ మేస్త్రీలు & వర్కర్స్ యూనియన్ ఖమ్మం అధ్యక్షులు దోనోజు పాపాచారి , ప్రధాన కార్యదర్శి దిగజర్ల వెంకన్న , ది ఖమ్మం నగర కార్పెంటర్స్ దూగోడ మిషన్స్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షులు దోనోజు శ్రీనివాసాచారి , ప్రధాన కార్యదర్శి సండూరి నాగాచారి తదితరులు పాల్గొన్నారు .
