+91 95819 05907

వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి !

స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి !!

పనైనా చూపండి – తిండైనా పెట్టండి !!!

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు.

వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:-మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వైరా నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.
స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ (ఎం) వైరా డివిజన్ కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదని విమర్శించారు. వైరా నియోజకవర్గం కేంద్రం అభివృద్ధికి సరిపడా నిధులు లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు వెంటాడుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలను ఎలా మార్చాలో ప్రజలకు తెలుసన్నారు. రాబోయే కాలం మొత్తం ప్రజా పోరాటాల కాలం అని, దీనికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని లేక పేదల రోజువారి జీవనం కూడా భారమవుతోందని, వలస కూలీలుగా ప్రతిరోజు100 కిలోమీటర్లు ఆటోలపై వెళ్లి జీవనం గడుపుతున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పట్టణ ప్రజలకు ఉపాధి హామీని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో “పనైనా చూపండి తిండైనా పెట్టండి” అనే నినాదంతో ప్రజా పోరాటాలు తప్పవూ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు దిగ్గి కృష్ణ, కొండెబొయిన నాగేశ్వరావు, సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు మచ్చా మణి, చింతనిప్పు చలపతిరావు, చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబొయిన నాగేశ్వరావు, కుందనపల్లి నరేంద్ర, బాణాల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, మాగంటి తిరుమలరావు, దొడ్డపనేని కృష్ణార్జునరావు, వేల్పుల రాములు, వజ్జ రామారావు, బోయినపల్లి శ్రీనివాసరావు, బాదావత్ శ్రీనివాసరావు, బి.బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !