+91 95819 05907

సిఐటియు,ఐద్వా ఆధ్వర్యంలో… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు…

మహాత్మా సావిత్రిభాయి ఫులే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి…

సిఐటియు,ఐద్వా నాయకులు
నూతి శైలజా,తోట పద్మ

మణుగూరు మార్చి 8: మణుగూరు శ్రామిక భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సిఐటియు,ఐద్వా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ముందుగా మహాత్మ సావిత్రిబాయి పూలే,చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సదస్సులో సిఐటియు,ఐద్వా నాయకులు నూతి శైలజా,తోట పద్మ లు మాట్లాడుతూ,నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని మహాత్మ సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ఎదిగే శక్తిగా మారాలని అనేక విజయాలను సాధించి నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని వారన్నారు.మహాత్మ సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి బ్రాహ్మణ సమాజాన్ని ఎదిరించి అణగారిన మహిళలకు చదువు నేర్పించి గొప్ప మహాత్మురాలుగా నిలిచిన మహోన్నతమైన శక్తిగా ఎదిగి ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. మహిళ మాతృమూర్తులు అందులేరు ఇందులేరు అనే సందేహంబు లేదు ఎందెందు వెతికిన అందందు కలరు అన్నట్లుగా మహిళలు నాటు వేసే దగ్గర నుండి నావి నడిపే వరకు ఎయిర్ పోర్టు నుండి ఎవరెస్టు వరకు మహిళలు దూసుకు వెళ్ళుతూ,ఏ రంగంలో చూసిన మహిళలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నా,నేటికి మహిళల మీద దాడులు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు రక్షణ కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మానభంగాలు,అత్యాచారాలు భ్రూణ హత్యలు జరుగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలను నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు పిట్టల నాగమణి,గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు కొండ్రు గౌరీ, బత్తుల రమాదేవి,జల్లా జయ,కౌశల్య,శ్రీలత కారం నాగేంద్ర, మడకం అరుణ,బోడ నాగలక్ష్మి,నరసమ్మ, సరిత,విజయ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !