+91 95819 05907

సిఐటియు,ఐద్వా ఆధ్వర్యంలో… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు…

మహాత్మా సావిత్రిభాయి ఫులే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి…

సిఐటియు,ఐద్వా నాయకులు
నూతి శైలజా,తోట పద్మ

మణుగూరు మార్చి 8: మణుగూరు శ్రామిక భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సిఐటియు,ఐద్వా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ముందుగా మహాత్మ సావిత్రిబాయి పూలే,చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సదస్సులో సిఐటియు,ఐద్వా నాయకులు నూతి శైలజా,తోట పద్మ లు మాట్లాడుతూ,నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని మహాత్మ సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ఎదిగే శక్తిగా మారాలని అనేక విజయాలను సాధించి నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని వారన్నారు.మహాత్మ సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి బ్రాహ్మణ సమాజాన్ని ఎదిరించి అణగారిన మహిళలకు చదువు నేర్పించి గొప్ప మహాత్మురాలుగా నిలిచిన మహోన్నతమైన శక్తిగా ఎదిగి ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. మహిళ మాతృమూర్తులు అందులేరు ఇందులేరు అనే సందేహంబు లేదు ఎందెందు వెతికిన అందందు కలరు అన్నట్లుగా మహిళలు నాటు వేసే దగ్గర నుండి నావి నడిపే వరకు ఎయిర్ పోర్టు నుండి ఎవరెస్టు వరకు మహిళలు దూసుకు వెళ్ళుతూ,ఏ రంగంలో చూసిన మహిళలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నా,నేటికి మహిళల మీద దాడులు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు రక్షణ కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మానభంగాలు,అత్యాచారాలు భ్రూణ హత్యలు జరుగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలను నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు పిట్టల నాగమణి,గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు కొండ్రు గౌరీ, బత్తుల రమాదేవి,జల్లా జయ,కౌశల్య,శ్రీలత కారం నాగేంద్ర, మడకం అరుణ,బోడ నాగలక్ష్మి,నరసమ్మ, సరిత,విజయ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

 Don't Miss this News !