+91 95819 05907

ఈనెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12 వసంతాలు ఉత్సవాలను విజయవంతం చేయండి.

జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 14న పిఠాపురంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయండి.

జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈనెల 14న జనసేన పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఊరైన పిఠాపురంలో జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ ఎలాంటి సిద్ధాంతంతో పార్టీని స్థాపించారో నేటికీ కట్టుబడి అదేవిధంగా ఉందని , పార్టీ స్థాపించిన నాటి నుండి తనదైన శైలిలో ప్రజా గలాన్ని వినిపిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తూ పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందని ఆనాటి పరిస్థితుల వల్ల ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన , వెనకడుగు వేయక విజయం అంటే ఇలా ఉండాలి అని దేశ ప్రజలు తన వైపు చూసేలా జనసేన పార్టీన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు . అవినీతి పరిపాలనకు ఆమడ దూరం ఉంటూ, ఆదర్శ పరిపాలన అందిస్తున్నాడు. అలాంటి నాయకుడు వెనక నేను నడుస్తూ , ప్రజలకు సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను . నాలాంటి నాయకులతో పాటు , ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ , మంచి పరిపాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ యువత పట్ల అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం పట్ల అవసరమైన సందర్భంలో తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు . పలు సందర్భంలో తెలంగాణరాష్ట్ర ఉద్యమం తణుకు స్ఫూర్తిని ఇచ్చిందని తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది . తెలంగాణ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఇవ్వటం జరిగింది . తెలంగాణ సమస్యలపై తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశం చేయడం కూడా జరిగింది . తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండాలని , ప్రతి సమస్యపై పోరాడాలని , నియోజకవర్గ ఇన్చార్జులను ప్రకటించడమే కాక గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం కొన్ని నియోజకవర్గాలో అతి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువతను ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపడం జరిగింది . యువతను ప్రోత్సహించడంలో అధినేత పవన్ కళ్యాణ్ గారికి యువత పట్ల ఉన్న మక్కువ అర్థం అవుతుంది . నాలాంటి యువతను ప్రోత్సహించిన పార్టీ జనసేన పార్టీ అని మిర్యాల రామకృష్ణ తెలియజేశారు . ఆవిర్భావ సభకు ఖమ్మం అసెంబ్లీ జనసేన పార్టీ శ్రేణులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని అధినేత ఇచ్చే సందేశాన్ని నిశితంగా గమనించి ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మిరియాల జగన్మోహన్ , బండారు రామకృష్ణ , ఖమ్మం నగర అధ్యక్షులు మేడాబోయిన కార్తీక్ , ఉపాధ్యక్షులు బానోతు దేవేందర్ , తుడుముత్తం రాజ్ , పుల్లారావు , రమణ , అఖిల్ , రచ్చ నాగరాజు , వంశీ , నాగేశ్వరావు , జనసేన పార్టీ నాయకులు , వీర మహిళ విభాగ అధ్యక్షులు షేక్ హసీనా , విద్యార్థి విభాగ నాయకులు విజయ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !