+91 95819 05907

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేసి రాణించాలి ట్రైనీ ఎస్సై సృజన

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్సై సృజన మహిళా మూర్తుల గొప్పతనాన్ని వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజంలో సంకల్ప బలముతో ఏదైనా సాధించగలరని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తారని మహిళలు కష్టపడి ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.మహిళలు ఎక్కువ మట్టుకు చదువును మధ్యలోనే ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వివాహాల దృష్ట్యా చదువును కొనసాగించలేక పోతునారన్నారని అన్నారు.కానీ తల్లిదండ్రులు మహిళల చదువుపై బాధ్యతగా దృష్టి పెడితే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు.వారి బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు.మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదని ఒంటరి ప్రయత్నం కాకుండా,సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సమాజంలో మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ముందడుగు వేసి రాణించాలని పిలుపునిచ్చారు.ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి ఆర్థిక,వృత్తిపరమైన అభివృద్ధికి మహిళలు సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.దేశంలో మహిళలను నాయకులుగా ఆవిష్కర్తలుగా సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే దిశగా వ్యవస్థలను రూపొందించాలన్నారు.ఈ సందర్భంగా మహిళా మూర్తులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !