+91 95819 05907

💥💥💥స్పాట్ న్యూస్:శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెందాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు

శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెందాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 8:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అశోక్ సింఘాల్ శిశుమందిర్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు.మొదటగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లో మెదక్ నియోజకవర్గాన్ని విద్య వైద్య పరంగా ఎంతోగానో అభివృద్ధి చేశామన్నారు.అలాగే మహిళా డిగ్రీ కళాశాల మరియు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలలు మంజూరు అయ్యి హాస్టళ్లను కూడా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.2021 సంవత్సరంలో ప్రారంభమైన సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం ఇపుడు శిశు నుంచి ఐదు తరగతుల వరకు విద్యార్థులతో విస్తరించి విద్యనందించడం గర్వంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెంది చక్కటి విద్యను అందించే దిశగా విద్యార్థులతో కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు.ఈ విద్యాపీఠంలో విద్యార్థులకు చిన్ననాటి నుండి సంస్కృతం సంగీతం నృత్యాలు నేర్పిస్తున్న ఆచార్యుల బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావు,రమేష్ రెడ్డి మామిడి సిద్ధ రాములు,కంభంపాటి విప్లవ కుమార్,అల్లాడి వెంకటేష్ ఎనిశెట్టి అశోక్ గుప్తా,పోచమ్మల అశ్విని శ్రీనివాస్,మండల ఎంఈఓ శ్రీనివాస్, శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు కవిత శిశు మందిర్ అధ్యక్ష కార్యదర్శులు పడకంటి సంగమేశ్వర్,పండరినాథ్ లు శిశు మందిర్ ఆచార్యుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !