నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం:నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 5వ తేదీన ఒడిశాలో జరగగా.. మంచి క్రీడా ప్రతిభ చాటి జట్టును విజేతగా నిలపడంలో భాగస్వాములైన జిల్లా వీల్ చైర్ క్రికెట్ క్రీడాకారులను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్ కే. సమీరుద్దీన్, బండి రాము, జె. సురేష్, హైదరాబాద్ కు చెందిన రమావత్ కోటేశ్వర్, మహమ్మద్ సమీ లతో కలిసి తాము గెలిచిన ట్రోఫీని ఎంపీ గారికి చూపించగా.. ఈ సందర్భంగా వారందరినీ సత్కరించారు. ఎంతో పట్టుదలతో జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను చాటి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు పాపా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16