+91 95819 05907

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ విప్లవస్ఫూర్తిని అనుసరిద్దాం.

నేటి గదర్ న్యూస్:

రాయల సుభాష్ చంద్రబోస్ అనుసరించిన విప్లవ స్ఫూర్తిని నేటి తరం విప్లవకారులు అనుసరించినప్పుడే భారత నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అని సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా నేతలు బుర్ర వెంకన్న, అజ్మీర బిచ్చ అన్నారు. ఈరోజు కామ్రేడ్ రవన్న 9వ వర్ధంతి సందర్భంగా చండ్ర కృష్ణమూర్తి ఫస్ట్ భవన్ లోఆదివారం రవన్న చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అరుదైన ఆదర్శ కమ్యూనిస్టు, విప్లవ ఆచరనే గీటురాయిగా విప్లవోద్యమాన్ని నడిపి అడవికి,మైదానానికి సుదీర్ఘ విప్లవ బాటసారిగా నిలిచిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) చివరి శ్వాస వరకు విప్లవాన్ని ఆకాంక్షించి అమరత్వం పొందాడని వారు అన్నారు.మితవాదం,అతివాదానికి వ్యతిరేకంగా పోరాడి నిజమైన విప్లవ సూత్రాలను కార్యకర్తలకు బోధించి విప్లవ మాస్టారుగా విప్లవద్యమంలో ప్రయాణించాడని ఈ క్రమంలో ఎన్ని నిర్భందాలు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబ్బరంగా నిలబడ్డాడని వారు అన్నారు. వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ఆశించి ప్రజా ఉద్యమాలను బలంగా నిర్వహించడమే రవన్నకు నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ,జర్పుల సుందర్, సావిత్రి,ఇల్లందు మండల నాయకులు శ్రీరాం కోటయ్య,గాంధీ, బుర్ర రాఘవులు,PYL నాయకులు దేవా, లక్ష్మయ్య, వాంకుడోత్ శంకర్,శాంతారావు, బాలు,ముత్తక్క తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !