గ్రామ కంఠం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్.
పక్కనే ఉన్న పట్టాభూమికి ఎసరు
బాధితులు ఆవేదన.
మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) మార్చి 9.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తమ స్థలం హద్దులను చూపించి పాత ఇంటి పై గ్రామ కంఠం క్రింద గిఫ్ట్ డిడి ద్వారా తనుభూమిని మాసాయిపేట మండల బిజెపి అధ్యక్షుడు వేణుగోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని
బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల సత్తయ్య కుటుంబానికి సంబంధించిన 277 సర్వే నెంబర్ గల 75 గజాల ఇంటి స్థలాన్ని హద్దులను చూపిస్తూ అదే గ్రామానికి చెందిన చాకలి సత్యనారాయణ తన కుమారుడైన వేణుగోపాల్ ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు గత ఎడాది డిసెంబర్ 3న గిఫ్ట్ డిడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆదివారం సత్తయ్య కుటుంబ సభ్యులు తమ 75 గజాల ఇంటి స్థలంలో భూమి పూజ నిర్వహిస్తుండగా చాకలి సత్తయ్య కుటుంబ సభ్యులు తమ స్థలంలో ఎలా భూమి పూజ చేస్తారంటూ తమను అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీంతో చాకలి సత్యనారాయణ తమ స్థలంలో అక్రమంగా భూమి పూజ చేస్తున్నారంటూ చేగుంట పోలీస్ స్టేషన్ లో తమపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర నాయకుల అండదండల తో తమపై అక్రమంగా కేసులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా తమ స్థల హద్దులను ఎలా రిజిస్ట్రేషన్ చేయించారంటూ బాధితులు మండిపడ్డారు. అక్రమ డాక్యుమెంట్లను సృష్టించి తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు కన్నీటి పర్వతమయ్యారు. ఇంత జరుగుతున్న వారి పార్టీ కను సైగలలోనే ఈ భూబాగోతాలు నడుస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టించిన వారిపై తక్షణమే విచారణ జరిపి వేణుగోపాల్ తో పాటు ఎవరెవరి ప్రమేయం ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.