+91 95819 05907

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు ఉపాధి పనులు కల్పించాలి…

.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలి …

భూక్యా వీరభద్రం, చింత నిప్పు చలపతిరావు లు డిమాండ్.

పల్లిపాడు లో స్థానిక సమస్యలపై పర్యటించిన సిపిఎం బృందం.

నేటి గదర్ న్యూస్,వైరా ప్రతినిధి,మార్చి 10:- మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు పల్లిపాడు లో సోమవారం సిపిఎం నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బృందాలో సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు స్థానిక నాయకులతో కలిసి పేదలు నివాసం ఉండే కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కల మీద బ్రతికే పేదలకు మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పనులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి హామీ పనులు మున్సిపాలిటీ పరిధిలో కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు 12 వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉపాధి పనులతో సంబంధం లేకుండా పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డబల్ బెడ్ రూమ్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని అక్కడి బాధితులు తమ గోడు ను వినిపించారు అని వారు తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేదలకు పట్టాలు గాని ఇంటి నెంబర్ గాని ఇవ్వలేదని సైడ్ డ్రైవ్ సక్రంగా లేక మురుగునీరు నిల్వ ఉండటం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నివాస ప్రాంతం సంవత్సర పై దృష్టి సారించాలండి డిమాండ్ చేశారు. వర్షాకాలం వరదలతో ఇళ్లలో నీళ్లు వస్తున్నాయని రోడ్డు పక్కన ఉన్న వరద కాలువను పై సైడ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఈనెల 12న వైరా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పర్యటనలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బత్తీరన్న, పారుపల్లి శ్రీనాథ్ బాబు, శాఖ కార్యదర్శి దామా వెంకటేశ్వరరావు, పెనుగొండ ఏడుకొండలు, సుల్తానా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !