.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలి …
భూక్యా వీరభద్రం, చింత నిప్పు చలపతిరావు లు డిమాండ్.
పల్లిపాడు లో స్థానిక సమస్యలపై పర్యటించిన సిపిఎం బృందం.
నేటి గదర్ న్యూస్,వైరా ప్రతినిధి,మార్చి 10:- మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు పల్లిపాడు లో సోమవారం సిపిఎం నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బృందాలో సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు స్థానిక నాయకులతో కలిసి పేదలు నివాసం ఉండే కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కల మీద బ్రతికే పేదలకు మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పనులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి హామీ పనులు మున్సిపాలిటీ పరిధిలో కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు 12 వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉపాధి పనులతో సంబంధం లేకుండా పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డబల్ బెడ్ రూమ్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని అక్కడి బాధితులు తమ గోడు ను వినిపించారు అని వారు తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేదలకు పట్టాలు గాని ఇంటి నెంబర్ గాని ఇవ్వలేదని సైడ్ డ్రైవ్ సక్రంగా లేక మురుగునీరు నిల్వ ఉండటం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నివాస ప్రాంతం సంవత్సర పై దృష్టి సారించాలండి డిమాండ్ చేశారు. వర్షాకాలం వరదలతో ఇళ్లలో నీళ్లు వస్తున్నాయని రోడ్డు పక్కన ఉన్న వరద కాలువను పై సైడ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఈనెల 12న వైరా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పర్యటనలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బత్తీరన్న, పారుపల్లి శ్రీనాథ్ బాబు, శాఖ కార్యదర్శి దామా వెంకటేశ్వరరావు, పెనుగొండ ఏడుకొండలు, సుల్తానా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.