+91 95819 05907

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు ఉపాధి పనులు కల్పించాలి…

.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలి …

భూక్యా వీరభద్రం, చింత నిప్పు చలపతిరావు లు డిమాండ్.

పల్లిపాడు లో స్థానిక సమస్యలపై పర్యటించిన సిపిఎం బృందం.

నేటి గదర్ న్యూస్,వైరా ప్రతినిధి,మార్చి 10:- మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు పల్లిపాడు లో సోమవారం సిపిఎం నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బృందాలో సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు స్థానిక నాయకులతో కలిసి పేదలు నివాసం ఉండే కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కల మీద బ్రతికే పేదలకు మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పనులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉపాధి హామీ పనులు మున్సిపాలిటీ పరిధిలో కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు 12 వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉపాధి పనులతో సంబంధం లేకుండా పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డబల్ బెడ్ రూమ్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని అక్కడి బాధితులు తమ గోడు ను వినిపించారు అని వారు తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేదలకు పట్టాలు గాని ఇంటి నెంబర్ గాని ఇవ్వలేదని సైడ్ డ్రైవ్ సక్రంగా లేక మురుగునీరు నిల్వ ఉండటం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నివాస ప్రాంతం సంవత్సర పై దృష్టి సారించాలండి డిమాండ్ చేశారు. వర్షాకాలం వరదలతో ఇళ్లలో నీళ్లు వస్తున్నాయని రోడ్డు పక్కన ఉన్న వరద కాలువను పై సైడ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఈనెల 12న వైరా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పర్యటనలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బత్తీరన్న, పారుపల్లి శ్రీనాథ్ బాబు, శాఖ కార్యదర్శి దామా వెంకటేశ్వరరావు, పెనుగొండ ఏడుకొండలు, సుల్తానా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

 Don't Miss this News !