రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని శనివారం నాడు స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరావు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్ ఆధ్వర్యంలో మేనేజర్ ఎం.శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి వార్డు అధికారులు జూనియర్ అసిస్టెంట్లు రెవెన్యూ సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు మరియు ఇతర పన్నులు వసూళ్లకు సంబంధించి అయన సమీక్ష సమావేశం నిర్వహించారు.రామాయంపేట మునిసిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్ల శాతాన్ని మెరుగుపరచడానికి మున్సిపాలిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పట్టణంలో మొండి బకాయిదారులు అందరికీ జప్తు నోటీసులు జారీ చేసి వసూలు చేయాలని తెలిపారు.ఈ మార్చి నెల ఆఖరి వరకు ఆస్తి పన్నులు మరియు ఇతర పన్నులు 95% వసూలు చేసే దిశగా అధికారులు పనిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.









