+91 95819 05907

టంగుటూరు ఎస్ఐ పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎయిమ్ నాయకులు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం టంగుటూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన, కొందరు విద్యార్థుల రాత్రి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం కేకు కట్ చేశారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న, ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు పక్కన కేక్ కోసిన విద్యార్థులను మందలించి వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని, విద్యార్థులను వారి మోటార్ సైకిళ్ళను స్టేషన్కు తీసుకువచ్చారు. తన బంధువులు కూడా ఆ విద్యార్థుల్లో ఉండటంతో ఆగమన రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అప్పటికే అక్కడ టిడిపి నాయకులు తన్నీరు చిరంజీవి తదితరులు ఎస్ఐ తో మాట్లాడుతున్నారు. ఆగమన రాజు కూడా ఎస్సై ముందు కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు చిరంజీవి ముందు చిటిక వేసి మరీ, మీ టైం అయిపోయింది, బయటికి పో అని అవమానకరంగా ఆగమన రాజును బయటకు పో అని వేలు చూపించారు. విద్యార్థుల్లో తన పరిచయస్తుల పిల్లలు ఉన్నారని ఆగమన రాజు చెబుతున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దళిత యువకుడి పట్ల కుల వివక్ష, అనుచిత ప్రవర్తనపై దళిత సంఘాల మండిపడ్డాయి. ఘటన జరిగిన వెంటనే ఆగమన రాజు ఎస్సై తనను అవమానించిన ఘటన గురించి ఎయిమ్ వ్యవస్థాపకులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎయిమ్ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆగమన రాజు టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !