+91 95819 05907

టంగుటూరు ఎస్ఐ పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎయిమ్ నాయకులు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం టంగుటూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన, కొందరు విద్యార్థుల రాత్రి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం కేకు కట్ చేశారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న, ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు పక్కన కేక్ కోసిన విద్యార్థులను మందలించి వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని, విద్యార్థులను వారి మోటార్ సైకిళ్ళను స్టేషన్కు తీసుకువచ్చారు. తన బంధువులు కూడా ఆ విద్యార్థుల్లో ఉండటంతో ఆగమన రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అప్పటికే అక్కడ టిడిపి నాయకులు తన్నీరు చిరంజీవి తదితరులు ఎస్ఐ తో మాట్లాడుతున్నారు. ఆగమన రాజు కూడా ఎస్సై ముందు కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు చిరంజీవి ముందు చిటిక వేసి మరీ, మీ టైం అయిపోయింది, బయటికి పో అని అవమానకరంగా ఆగమన రాజును బయటకు పో అని వేలు చూపించారు. విద్యార్థుల్లో తన పరిచయస్తుల పిల్లలు ఉన్నారని ఆగమన రాజు చెబుతున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దళిత యువకుడి పట్ల కుల వివక్ష, అనుచిత ప్రవర్తనపై దళిత సంఘాల మండిపడ్డాయి. ఘటన జరిగిన వెంటనే ఆగమన రాజు ఎస్సై తనను అవమానించిన ఘటన గురించి ఎయిమ్ వ్యవస్థాపకులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎయిమ్ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆగమన రాజు టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం ప్రతి పేద ఇంటి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మారుమూల నియోజకవర్గమైన పినపాకకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటుకు

Read More »

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన డాక్టర్ వీరమల్ల దేవేందర్ రెడ్డి పరిశోధన

*అరటి తొక్కలతో భూసార నాణ్యత పెంపు – వ్యవసాయ రంగానికి వినూత్న మార్గదర్శకత* *ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ”లో ప్రముఖ స్థానం* *ప్రకృతి సహజ వనరుల

Read More »

టంగుటూరు ఎస్ఐ పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎయిమ్ నాయకులు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ

Read More »

గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగించడం పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 15: దమ్మపేట మండలం, పూసుకుంట గ్రామంలో గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగంపై కలెక్టర్ శనివారం అవగాహన కల్పించారు. గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ ఉపయోగించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా

Read More »

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరరావు సమీక్ష సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని శనివారం నాడు స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరావు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ మోహన్ నాయక్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తొంట సావిత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్

Read More »

 Don't Miss this News !