+91 95819 05907

నేటి నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సమయ పాలనపై కీలక నిర్ణయం తీసుకున్నది.ఈ క్రమంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని పేర్కొన్నారు.ఇక పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని పేర్కొన్నారు.ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేస్తారని తెలిపారు.ఈ ఒంటి పూట బడులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.అలాగే ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు జూన్ 11 వరకు ఉంటాయని జూన్ 12న తిరిగి పాఠశాలలు పున్న ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !