+91 95819 05907

అత్యాచారయత్నం కేసు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే హర్షనీయం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 01:- పదకొండేళ్ల బాలికను తాకరానిచోట పట్టుకోవడం ఆమె పైజామా లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై,భారత సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.ఈ నిర్ణయం పిల్లల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ వంగరి కైలాస్ హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ దాఖలు చేసిన ప్రత్యేకమైన 5 పిటిషన్ లను సుప్రీంకోర్టు అంగీకరించిందని, బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి ఇవ్వడం స్వాగతించ దగ్గ విషయం అన్నారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిల్లల రక్షణ,హక్కుల కోసం 416 జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీవోల నెట్వర్క్ తో కలిసి పోరాడుతోందని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మెదక్,నిర్మల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని తెలిపారు.దేశంలో ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయానికి గురి కాకూడదని ఆయన అన్నారు.అలాంటి వారికి ఈ అలయన్స్ అండగా నిలుస్తుందని తెలిపారు.పిల్లల హక్కుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుందన్నారు.ఈ కేసులో ముఖ్య విషయాలను ఆయన తెలియజేశారు.ఈ తీర్పులో చేసిన కొన్ని పరిశీలనలు ముఖ్యంగా, 21,24, 26 పేరాలలో తీర్పు పూర్తిగా సున్నితత్వం లేకపోవడాన్ని గుర్తించారని, దాదాపు నాలుగు నెలల చర్చల తర్వాత ఇచ్చిన ఈ తీర్పు చట్ట విరుద్ధంగా,అమానవీయంగా ఉందని ధర్మాసనం పేర్కొందని తెలిపారు.మూడున్నర సంవత్సరాలకు పైగా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని,అధికారిక దర్యాప్తు ప్రారంభించకుండా,మూడు సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిందని పేర్కొన్నారు.పేద బాల బాధితురాలికి ఈ సుదీర్ఘ కాలం విచారణతో తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !