+91 95819 05907

అత్యాచారయత్నం కేసు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే హర్షనీయం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 01:- పదకొండేళ్ల బాలికను తాకరానిచోట పట్టుకోవడం ఆమె పైజామా లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై,భారత సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.ఈ నిర్ణయం పిల్లల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ వంగరి కైలాస్ హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ దాఖలు చేసిన ప్రత్యేకమైన 5 పిటిషన్ లను సుప్రీంకోర్టు అంగీకరించిందని, బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి ఇవ్వడం స్వాగతించ దగ్గ విషయం అన్నారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిల్లల రక్షణ,హక్కుల కోసం 416 జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీవోల నెట్వర్క్ తో కలిసి పోరాడుతోందని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మెదక్,నిర్మల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని తెలిపారు.దేశంలో ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయానికి గురి కాకూడదని ఆయన అన్నారు.అలాంటి వారికి ఈ అలయన్స్ అండగా నిలుస్తుందని తెలిపారు.పిల్లల హక్కుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుందన్నారు.ఈ కేసులో ముఖ్య విషయాలను ఆయన తెలియజేశారు.ఈ తీర్పులో చేసిన కొన్ని పరిశీలనలు ముఖ్యంగా, 21,24, 26 పేరాలలో తీర్పు పూర్తిగా సున్నితత్వం లేకపోవడాన్ని గుర్తించారని, దాదాపు నాలుగు నెలల చర్చల తర్వాత ఇచ్చిన ఈ తీర్పు చట్ట విరుద్ధంగా,అమానవీయంగా ఉందని ధర్మాసనం పేర్కొందని తెలిపారు.మూడున్నర సంవత్సరాలకు పైగా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని,అధికారిక దర్యాప్తు ప్రారంభించకుండా,మూడు సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిందని పేర్కొన్నారు.పేద బాల బాధితురాలికి ఈ సుదీర్ఘ కాలం విచారణతో తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !