+91 95819 05907

అత్యాచారయత్నం కేసు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే హర్షనీయం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 01:- పదకొండేళ్ల బాలికను తాకరానిచోట పట్టుకోవడం ఆమె పైజామా లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై,భారత సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.ఈ నిర్ణయం పిల్లల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ వంగరి కైలాస్ హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ దాఖలు చేసిన ప్రత్యేకమైన 5 పిటిషన్ లను సుప్రీంకోర్టు అంగీకరించిందని, బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి ఇవ్వడం స్వాగతించ దగ్గ విషయం అన్నారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిల్లల రక్షణ,హక్కుల కోసం 416 జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీవోల నెట్వర్క్ తో కలిసి పోరాడుతోందని,విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మెదక్,నిర్మల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని తెలిపారు.దేశంలో ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయానికి గురి కాకూడదని ఆయన అన్నారు.అలాంటి వారికి ఈ అలయన్స్ అండగా నిలుస్తుందని తెలిపారు.పిల్లల హక్కుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుందన్నారు.ఈ కేసులో ముఖ్య విషయాలను ఆయన తెలియజేశారు.ఈ తీర్పులో చేసిన కొన్ని పరిశీలనలు ముఖ్యంగా, 21,24, 26 పేరాలలో తీర్పు పూర్తిగా సున్నితత్వం లేకపోవడాన్ని గుర్తించారని, దాదాపు నాలుగు నెలల చర్చల తర్వాత ఇచ్చిన ఈ తీర్పు చట్ట విరుద్ధంగా,అమానవీయంగా ఉందని ధర్మాసనం పేర్కొందని తెలిపారు.మూడున్నర సంవత్సరాలకు పైగా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని,అధికారిక దర్యాప్తు ప్రారంభించకుండా,మూడు సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిందని పేర్కొన్నారు.పేద బాల బాధితురాలికి ఈ సుదీర్ఘ కాలం విచారణతో తీవ్రమైన అన్యాయం జరిగిందని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !