నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది
మండల పరిధిలోని చిన్న మండవ, పాతర్లపాడు,రేపల్లెవాడ.గ్రామంలో..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ మార్ రెడ్డి ఆదేశాల మేరకు పలు గ్రామం లో రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం అందించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని *చింతకాని మండల తహసీల్దార్ కూరపాటి అనంతరాజు ప్రారంభించారు..*
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సన్న బియ్యాన్ని రీసైకిల్ చేయకుండా భోజనం చేయాలి పేద ప్రజలు గుండె చప్పుడు మన ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చైనా కూడా లెక్కచేయకుండా సన్న బియ్యం అందిస్తుందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే మన ప్రభుత్వం ఉద్దేశం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో.. ఖమ్మం మార్కెట్ కమిటీమాజీ ఉపాధ్యక్షులు మడుపల్లి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్లు కొప్పుల గోవిందరావు , సట్టు వెంకటేశ్వర్లు, తోటకూరి ప్రగతి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్ , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంచుమర్తి రామకృష్ణ , మండల కాంగ్రెస్ నాయకులు బందెల నాగార్జున, పాతర్లపాడు ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కిలారు మనోహర్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల చంద్రం, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి తడికమల్ల రమేష్, మండల సేవాదళ్ అధ్యక్షులు పర్చగాని సతీష్, మాజీ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా శేషగిరి, కొత్తపల్లి బసవయ్య, పర్చగాని వెంకట్రాములు,బండి శ్రీను, ఉప సర్పంచ్ తేలికుంట్ల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ మద్దినేని పరిణిత, బొర్రా లక్ష్మీ నారాయణ ,మరీదు రామకృష్ణ, పర్చగాని లక్ష్మణ్, నరసింగుల బిక్షం,వలపర్ల రమేష్, మండల డీలర్ సంఘం అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు.