+91 95819 05907

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయాలనే ఆలోచన వెనక్కి తీసుకోవాలి : SFI

– ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్‌ చేయటం దుర్మార్గపు చర్య.

– నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులు హరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.

– మా పాలనలో నిర్బంధాలు ఉండవని ప్రగతి భవన్‌ కంచెలు తీసివేసి ఇప్పుడు ప్రజల మీదనే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.

– తక్షణమే అక్రమంగా అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలి.

– 400 ఎకరాల భూమిని యూనివర్శీటీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిస్టి బొమ్మను దగ్నం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభలో సి.ఎం.తప్పుడు ప్రచారం చేశారు. కార్పోరేట్‌ శక్తులకు భూములను అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌.సి.యు. భూములను అమ్మేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్‌, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టింది. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎర్రం నవీన్‌ను అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రి వరకు ఏక్కడ ఉన్నాడో చెప్పకుండా, ఫోన్‌ లాక్కోని అర్ధరాత్రి హించించి రిమాండ్‌ చేయటం, విద్యార్థలపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘలనలకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే పోలీసులు అర్దరాత్రి నుండి జిల్లాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను 298 మందిని ఖమ్మం జిల్లాలో పలు మండల కేంద్రాలలో నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గపు చర్య. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటి ఖండిసస్తుంది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తుంది. ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరు. ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ కోరుతుందనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు జిల్లా నాయకులు వినోద్, వినయ్, మనోజ్, లోకేష్, వెంకటేష్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !