ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది
జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
భూములు, అడవులు, పక్షులు, జంతువులు అందమైన ప్రకృతిని కాపాడాలి.
400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలి
విద్యార్థులపై లాటీ చార్జీ చేయడాన్ని ఖండిస్తున్నాం
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి, శ్రీనివాస్
వైరా :అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, లాటీ చార్జీలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, యూనివర్సిటీల భూములు, అడవులు, పక్షులు అందమైన వృక్షాలు, ప్రకృతిని కాపాడాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయటాన్ని, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన సిపిఐ(ఎం) పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ జీవ వైవిద్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, లెకపోతే ప్రజల మనుగడ ప్రమాదంలో పడుతుందని, విభిన్న రకాల వృక్షాలు, పక్షులు, జంతువులు, జలచరాలు, క్షీరదాలకు నిలయమై హైదరాబాదుకు ఊపిరితిత్తులు లాగా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మడాన్ని ప్రకృతి ప్రేమికులు, మేదావులు, ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వం అమ్ముతున్న 400 ఎకరాల భూమిలో 734 రకాలకు చెందిన నాలుగు లక్షల వృక్షాలు, 223 రకాల జాతులకు చెందిన పక్షులు, నక్షత్ర తాబేళ్లు, జింకలు, దుప్పులు, నెమళ్లు జీవ వైవిద్యంతో నివసిస్తూ ప్రజలకు స్వచ్చమైన ఆక్సిజన్ అందిస్తున్న అడవులు ఉన్నాయని తెలిపారు. యునివర్సిటీ అబివృద్ధి కోసం ఉపయోగించాల్సిన భూములను ప్రభుత్వం తమ మనుగడ కోసం అమ్ముకోవడం తగదని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరిస్తూ ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెంచిందని విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించి మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడాన్ని, శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థులు, నాయకుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన విద్యార్థులు, సిపిఎం నాయకులను వెంటనే బెషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తోట నాగేశ్వరావు, పారుపల్లి కృష్ణారావు, తూము సుధాకర్, రాచభంటి భత్తిరన్న, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, సంక్రాంతి పురుషోత్తమరావు, యనమద్ది రామకృష్ణ, తాళ్లూరి నాగేశ్వరరావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, మాడపాటి వెంకటి, కురుగుంట్ల శ్రీనివాసరావు, వెల్పుల మైఖేల్, నల్లమల కోటేశ్వరావు, పాసంగులపాటి చలపతిరావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









