+91 95819 05907

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు : సీపీఎం

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది

జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

భూములు, అడవులు, పక్షులు, జంతువులు అందమైన ప్రకృతిని కాపాడాలి.

400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలి

విద్యార్థులపై లాటీ చార్జీ చేయడాన్ని ఖండిస్తున్నాం

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి, శ్రీనివాస్
వైరా :అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, లాటీ చార్జీలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, యూనివర్సిటీల భూములు, అడవులు, పక్షులు అందమైన వృక్షాలు, ప్రకృతిని కాపాడాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విక్రయాన్ని విరమించుకోవాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయటాన్ని, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన సిపిఐ(ఎం) పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్డు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ జీవ వైవిద్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, లెకపోతే ప్రజల మనుగడ ప్రమాదంలో పడుతుందని, విభిన్న రకాల వృక్షాలు, పక్షులు, జంతువులు, జలచరాలు, క్షీరదాలకు నిలయమై హైదరాబాదుకు ఊపిరితిత్తులు లాగా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మడాన్ని ప్రకృతి ప్రేమికులు, మేదావులు, ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వం అమ్ముతున్న 400 ఎకరాల భూమిలో 734 రకాలకు చెందిన నాలుగు లక్షల వృక్షాలు, 223 రకాల జాతులకు చెందిన పక్షులు, నక్షత్ర తాబేళ్లు, జింకలు, దుప్పులు, నెమళ్లు‌ జీవ వైవిద్యంతో నివసిస్తూ ప్రజలకు స్వచ్చమైన ఆక్సిజన్ అందిస్తున్న అడవులు ఉన్నాయని తెలిపారు. యునివర్సిటీ అబివృద్ధి కోసం ఉపయోగించాల్సిన భూములను ప్రభుత్వం తమ మనుగడ కోసం అమ్ముకోవడం తగదని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరిస్తూ ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెంచిందని విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించి మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడాన్ని, శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలిసులు లాటీ చార్జీ చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థులు, నాయకుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన విద్యార్థులు, సిపిఎం నాయకులను వెంటనే బెషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తోట నాగేశ్వరావు, పారుపల్లి కృష్ణారావు, తూము సుధాకర్, రాచభంటి భత్తిరన్న, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, సంక్రాంతి పురుషోత్తమరావు, యనమద్ది రామకృష్ణ, తాళ్లూరి నాగేశ్వరరావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, మాడపాటి వెంకటి, కురుగుంట్ల శ్రీనివాసరావు, వెల్పుల మైఖేల్, నల్లమల కోటేశ్వరావు, పాసంగులపాటి చలపతిరావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !