నేటి గదర్ న్యూస్ మంగపేట. వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షుడు కటుకూరు సాంబశివరావు మంగపేట .
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు జర్నలిస్టు సంక్షేమంపై దృష్టి సారిస్తామని ఎన్నికల సమయంలో హామీలే తప్ప నేటికీ నెరవేరిందేమి లేదని మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టుల సంగం అధ్యక్షుడు కటుకూరు సాంబశివరావు అన్నారు.గత ప్రభుత్వం పది సంవత్సరాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిందని ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో జర్నలిస్టులున్నారని ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చి ఆదుకోవాలన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోను ఉద్యమం ఉప్పెనలా మారడానికి జర్నలిస్టులదే ప్రధాన పాత్ర అని గుర్తుచేశారు.ఎన్నో సంవత్సరాలుగా అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలు చేయడంతో విని ఆనందపడటం తప్ప నేటికీ ఒరిగిందేమీ లేదన్నారు.గతంలో ప్రతిపక్ష శాసనసభ్యురాలుగా ధనసరి అనసూయ (సీతక్క) ఉన్నప్పుడు స్థానిక జర్నలిస్టులకు అండగా నిలిచి కేటాయించాల్సిన భూమిని సైతం పరిశీలించడం జరిగిందని కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడడంతో మరింత జాప్యం నేటికీ కొనసాగుతుందన్నారు.మంత్రి సీతక్కకు ఈ విషయం పై పూర్తి అవగాహన ఉన్నందున మరికొంత దృష్టిసారించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పెద్దన్న పాత్ర పోషించే జర్నలిస్ట్ లను హక్కునచేర్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.ముఖ్యమంత్రి తరువాత మంత్రిమండలిలో అంత ప్రాధాన్యత గల నాయకురాలిగా ఈ ప్రాంత శాసనసభ్యురాలే కావటంతో మొదటగా ములుగుజిల్లాలో ఉన్న జోర్నలిస్ట్లు ఇక తమ సమస్యలు పరిస్కారమయ్యాయని ఆనందపడ్డారని నేటికీ ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. జర్నలిస్టులవి గొంతెమ్మ కోరికలేమి కాదని రాష్ట్రంలో కొందరు నాయకులు తమ నియోజకవర్గాలలో ఇదివరకే పరిష్కార మార్గాలు చూపారన్నారు ప్రభుత్వం దృష్టి సారించి అర్హత కలిగిన జర్నలిస్టుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.









