— యుద్ధం వచ్చినప్పుడు ముందస్తు పౌర రక్షణపై అవగాహన పెంచిన సన్నివేశాలు.
—సెల్ఫ్ డిఫెన్స్ , ఫైర్ సేఫ్టీ , బ్లాక్ అవుట్ , ప్రధమ చికిత్స లపై అబ్బురపరిచిన సన్నివేశాలు.
–పర్యవేక్షించిన మాజీ సైనిక ఉద్యోగి ఎస్ ఎం అరుణ్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం,మే9, ఆంధ్ర ప్రభ.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధం వచ్చినప్పుడు పౌరులు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను వివరిస్తూ శుక్రవారం స్థానిక ఎన్ ఎస్ సి కాలనీ హై స్కూల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మాజీ సైనికులు నిర్వహించిన సన్నివేశాలు అందరినీ చైతన్య పరిచాయి. మాజీ సైనిక ఉద్యోగుల ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి ఎస్ఎం అరుణ్ పర్యవేక్షణలో నిర్వహించిన యుద్ధ ముందస్తు పౌర రక్షణ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచి అవగాహన పెంచాయి. శత్రువులు బాంబులు వేసి భవనాలకు మంటలు అంటుకున్నప్పుడు పౌరులు ధైర్యంగా ఉండి ఆ మంటలనుంచి బయటపడే సన్నివేశాన్ని ఎస్ఎం అరుణ్ రూపొందించి ప్రదర్శించారు. మంటల్లోంచి బయటపడి గాయాలతో ఉన్నవారికి ప్రధమ చికిత్స చేసే విధానాన్ని వివరించారు. బాంబు దాడులు జరిగినప్పుడు, విపరీతంగా గాయపడినప్పుడు
వెనువెంటనే ప్రధమ చికిత్స చేసే విధానాన్ని తెలియజేశారు. యుద్ధం సంభవించినప్పుడు రాత్రిపూట నగరాల ఉనికి, గ్రామాల ఉనికి శత్రువులకు తెలియకుండా రాత్రిపూట అందరూ విద్యుత్ను పూర్తిగా ఆపు చేసి ఎమర్జెన్సీ బ్లాక్ అవుట్ నిర్వహించాలని చైతన్యం కలిగించారు. నీళ్లలో పడినప్పుడు, వరదలు సంభవించినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతో ముందస్తుగా ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్ లను తయారు చేసుకునే విధానాన్ని మాజీ సైనికులు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటలపాటు మాజీ సైనికులు, సైనికులు, ఎన్సిసి క్యాడెట్లు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 150 మంది ఎన్సిసి క్యాడెట్లు, యువతి యువకులు, 20 మంది ఆర్మీ జవాన్లు, 50 మంది మాజీ సైనికు ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, అడ్వకేట్లు, వివిధ పాఠశాలల, కళాశాలల కరస్పాండెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్ మేజర్ బహుదూర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్, ఆర్పిఎఫ్ సిఐ , మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులు , విద్యార్థి సంఘాల నాయకుడు వెంకటేష్, యువ అడ్వకేట్ నాళ్ల భానుచందర్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.









