నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి.
కొణిజర్ల వైరా ప్రాంత సిపిఎం నిర్మాణం చేసిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు సంక్రాంతి మధుసూదన్ రావు ఈనెల 11న సంస్మరణ సభ తో పాటు భారీ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని లాలాపురం స్థూపం నిర్మాణం పనులను సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి చింతనపు చలపతిరావు సిపిఎం కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు లు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు, జిల్లాలో గొప్ప నాయకుడు గుర్తుగా స్థూపం నిర్మాణం జరుగుతుందని, ఈనెల 11న జరుగు స్తూపావిష్కరణ, సంస్మరణ సభ భారీ సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు, సంస్మరణ సభలో సిపిఎం జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు, కార్యక్రమంలో సిపిఎం వైరా పట్టణ నాయకులు, సంక్రాంతి నరసయ్య, మాజీ సర్పంచ్ సంక్రాంతి చంద్రశేఖర్ రావు,,అనుములు రామారావు, సంక్రాంతి పురుషోత్తరావు, సంక్రాంతి సుబ్బయ్య,పాషా, సంక్రాంతి మధుసూదన్ రావు కుమారుడు, సంక్రాంతి రవికుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
అనంతరం సిపిఎం నేతలు ఈ మధ్యకాలంలో మృతి చెందిన సిపిఎం సభ్యుడు సంక్రాంతి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
