★మావోయిస్టులతో చర్చలు జరపాలి :ఆదివాసి సంఘాలు
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రం కేంద్రంలో ఆదివాసి సంఘాల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి, సత్యం, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడుతూ.
ఆపరేషన్ కఘర్ ఆదివాసులకి మరణ శాసనంగా మారిందని ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయాలని అడవిలో ఉన్న కనీజ సంపదలను బహుళ జాతి కంపెనీలకుదొసిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దానిలోనే భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలపై మావోయిస్టులు అని ముద్ర వేసి బూటకపు ఎన్కౌంటర్లు జరిపి ఆదివాసులని చంపుతున్నారని అన్నారు. అంతమొందించడమే ఆపరేషన్ కగార్ అని పేరుతో కేంద్ర బలగాలను ఆదివాసీలపై విరుచుకుపడే విధంగా చేస్తుందని మావోయిస్టులు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాలకు నాలుగు దపాలుగా శాంతి చర్చలకు సిద్ధమని తెలియచేసిన చేసినా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఒకే చెప్పకుండా ఆపరేషన్ కగర్ నిలుపుదల చేయకుండా భూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపి సతిషుగడ్ లొ జరుగుతున్న మరణ హోమాన్ని నిలుపుదల చేసి రాజ్యాంగ నిపుణులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈసం కృష్ణ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు చింత వెంకట్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూణెం రమణబాబు, తాటి రమేష్, అరేం నరేష్,అరేం రామారావు, మొక్కళ్ళ ప్రసాద్, కల్తీ మల్లయ్య,గోగ్గేలా సాంబాశివరావు, తదితరులు పాల్గొన్నారు.