నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 09: పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన అశ్వారావుపేట మండలం, గుమ్మడివల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన సాధనం రాజారావు (45) వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రువారం పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో, వర్షం పడుతుండడంతో పక్కనే ఉన్న ఓ వేపచెట్టు క్రింద నిలబడగా ఒక్కసారిగా పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై పోలీసులు ఘటనా స్థానానికి చేరుకొని దర్యాప్తి చేపట్టారు.
Post Views: 38