+91 95819 05907

ఎంపీ వద్దిరాజు చేయూత.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు.
బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊరు వదిలి గల్ఫ్ బాట పట్టిన నల్లగొండ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అక్కడ అకాల మృత్యువుకు లోనయ్యారు.అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే స్థోమత లేక కుటుంబ సభ్యులు ఎంపీ రవిచంద్రను సంప్రదించడంతో ఆయన వెంటనే స్పందించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.మరిన్ని వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన శ్రీరాములు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లారు.ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన రియాద్ లోని ఒక ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతూనే తుది శ్వాస విడిచారు.విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో శ్రీరాములు మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించడం ఎలాగో,ఎవరిని కలవాలో,అందుకు ఎంత ఖర్చవుతుందో తెలియక, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకుల సాయంతో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను సంప్రదించడం జరిగింది.ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి వారిని ఓదార్చి మనోధైర్యాన్నిస్తూ, అందుకు అవసరమైన అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తగు ఏర్పాట్లు చేశారు.ఇందుకు గాను ఖర్చైన సుమారు 3 లక్షలు రూపాయలను ఎంపీ రవిచంద్ర భరించారు.దీంతో మృతదేహం విమానంలో హైదరాబాద్ ,ఆ తర్వాత బుధవారం రాత్రి స్వస్థలం వెలిమినేడు చేరింది.శ్రీరాములు కుటుంబ, సభ్యులు, బంధుమిత్రులు,స్థానికులు ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !