స్టాక్ యార్డ్ కు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలు
పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ కే ఇవ్వాలి.
మంగపేట.
నేటి గదర్ న్యూస్ మంగపేట. గోదావరి నది నుండి స్టాక్ యార్డుకు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలు పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టి ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్ కు అప్పగించాలని గ పత్రికా ముఖంగా సొసైటీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగపేట మండలం వాడగూడెం గ్రామంలో మా సొసైటీ 2010 సంవత్సరంలో 1964 చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొంది ఉందన్నారు. కానీ ఇక్కడ మాత్రం శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఇసుక క్వారీలేబర్ కాంట్రాక్టు మ్యాక్ సొసైటీ కేవలం జూన్ 03వతేది 2023లో 1995 చట్టం ప్రకారం అనుబంధ సంస్థలతోమాత్రమే రిజిస్టర్ చేసుకోబడింది. ఇది ప్రైవేట్ పన్నులు చిన్నచిన్న సంస్థల కొరకు లోన్ తీసుకొనెందుకు ఉపయోగపడుతుంది. ఇసుక క్వారీలు చేయడానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే సభ్యత్వం ఉంటుంది అని సొసైటీ చట్టంలో చెబుతుంది అని వారు అన్నారు. కానీ 1964 చట్టం ప్రకారం సొసైటీలో అన్ని కుటుంబాలకు సభ్యత్వం ఇచ్చి ఉన్నది. కానీ ఈ కుటుంబం నుండి కొందరిని విడదీసి 1995 చట్టంలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఇసుక క్వారీలేబర్ కాంట్రాక్టు మ్యాక్ సొసైటీలో ద్వంద్వ సభ్యత్వం తీసుకొన్నారు అని అన్నారు. ఈ విషయాన్ని కోర్టు నిర్దారించి మ్యాక్ సొసైటీ కి ఇచ్చినటువంటి నిర్వహణ బాధ్యతలు రద్దు చేయాలని తెలిపింది. కావున మా గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకు న్యాయం న్యాయం జరగాలంటే అన్ని ప్రభుత్వా అనుమతులతో కూడిన పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్ కు గోదావరి నది నుండి స్టాక్ యార్డుకు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలను మాకు అప్పగించాలి అని వారు కోరారు. కావున కలెక్టర్ టి ఎస్ ఎం డి సి వారు జోక్యం చేసుకొని అన్ని అనుమతులు ఉన్న మా సొసైటీ కి నిర్వహణ బాధ్యతలు అప్పగించి మా గ్రామానికి ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమ్మక్క సారక్క ఇసుక క్వారీ సొసైటీ అధ్యక్షులు అధ్యక్షులు వాసం మల్లయ్య, ఉపాధ్యక్షులు పోలబోయిన రవరాజు, మాజీ ఉపాధ్యక్షులు వాసం బుచ్చయ్య, మడి సతీష్, రాధాకృష్ణ,వాసం జమున, కల్తీ లక్ష్మి, వాసం లక్ష్మి, వాసం రజిత, మల్లికార్జున్, నరసయ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









