రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 17:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం సిఎంఆర్ఎఫ్ క్రింద చెక్కును గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ అనేది నిరుపేదలకు ఒక వరం అని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందిస్తు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారుడు అంజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు చింతం సత్యం,కొప్పుల హనుమండ్లు,కుమార్,లింగం,బాలయ్య,కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.









