★ఇందిరమ్మ గ్రామ కమిటీలు సూచించిన లిస్టులు న్యాయబద్ధంగా లేదు
★గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టును రద్దుచేసి రీ సర్వే నిర్వహించాలి
★ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్ట్ లను 26 గ్రామపంచాయతీ కార్యాలయాలలోని నోటీసు బోర్డులలో తక్షణమే పెట్టాలి.
★ చర్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో చాలా మంది నిరుపేదల పేర్లు లేకపోవడం దుర్మార్గం.
★ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకా,లేక పకడ్బందీ ఇల్లు ఉన్నోలకా.
★పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందకపోతే ఉద్యమాలు తప్పవ్.
★బహుజన్ సామాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ డిమాండ్.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం పార్టీ చర్ల మండల కోశాధికారి పంబి కుమారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం నిజమైన నిరుపేదల కోసమా కాదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్ల మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు నిజమైన నిరుపేదలు చాలా మంది ఎంపిక కాకపోవడం దుర్మార్గం,బాధాకరం అన్నారు. గ్రామస్థాయిలలో ఇందిరమ్మ కమిటీల కుట్రలకు నిజమైన లబ్ధిదారులు బలవుతున్నారని అన్నారు గ్రామ కమిటీలు సూచించిన లిస్టు న్యాయబద్ధంగా లేదని విమర్శించారు నిజమైన నిరుపేదలకు రాని ఇల్లు పకడ్బందీగా ఇల్లు ఉన్నవాళ్ల పేర్లను ఎలా చేరుస్తారని ఆయన మండిపడ్డారు తక్షణమే సర్వే జరిపిన లిస్టులను చర్ల మండలం లోని 26 గ్రామపంచాయతీ కార్యాలయాలలో నోటీసు బోర్డులో పెట్టాలని తద్వారాగే గ్రామాలలో ఉన్న నిజమైన అర్హులు అనర్హులు ఎవరనేది బహిర్గతం అవ్వుతుందని అన్నారు. తద్వారా నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయొచ్చని తెలిపారు బహుజన్ సమాజ్ పార్టీ పలు గ్రామాలలో సందర్శించిన క్రమంలో స్థానిక పేద ప్రజలు మాకు అన్యాయం జరిగిందంటూ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులలో మా పేర్లు లేవంటూ మా పార్టీ దృష్టికి చెప్తూ గోడు వెళ్లబుచ్చారన్నారనీ తెలిపారు ఒకపక్క తెలంగాణ సర్కార్ నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకం అందాలని , అనర్హులకు ఈ పథకాన్ని ఎంపిక చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అలాగే అనర్హులకు ఇండ్లు ఎంపిక చేస్తే ఆ ఇండ్లని మధ్యలోనే నిలుపుదల చేస్తామని సర్కారు చెప్పిన మాట మార్చారా అని ఆయన గుర్తుచేశారు. బహుజన సమాజ్ పార్టీ పేద ప్రజల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోని నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించి నిరుపేదల బ్రతుకుల్లో వెలుగు కాంతులు నింపాలని ఆయన కోరారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చెయ్యనియెడల బాధిత ప్రజానీకాన్ని మొత్తాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, గౌర్ల సూరమ్మ, అయినవోలు శ్రీను, నక్క సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.









