+91 95819 05907

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం!

​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు శనివారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించి ఆపదలో ఉన్న కుటుంబాలకు అభయమిచ్చారు. తొలుత గుమ్మడివల్లి గ్రామంలో నాయకులతో ఆత్మీయంగా భేటీ అయి భవిష్యత్ రాజకీయాలపై దిశానిర్దేశం చేసిన ఆయన, అనంతరం కోయరంగాపురం గ్రామంలో అగ్నిప్రమాదానికి గురై ఇల్లు కోల్పోయిన కారం మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, తక్షణమే ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు; అలాగే అధికారులతో మాట్లాడి బాధితులకు కొత్త ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా నారాయణపురంలో అనారోగ్యంతో మృతిచెందిన బోడపాటి వెంకటమ్మ కుమార్తె కుటుంబాన్ని, మరియు బీఆర్ఎస్ నాయకుడు జక్కుల రాంబాబు మాతృమూర్తి స్వర్గీయ నాగమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కోయరంగాపురం సర్పంచ్ సోడెం చిన్ని గంగమ్మ, ఉప సర్పంచ్ మడివి లక్ష్మణ్, వార్డ్ మెంబర్లు సెట్టిపల్లి కృష్ణారెడ్డి, ముత్తమ్మలతో పాటు నాయకులు చందా లక్ష్మీనర్సయ్య, మిండ దుర్గారావు, చిచ్చోడు సీతారాములు, కుర్సం వెంకటేశ్వరరావు, షేక్ అమీర్, పుట్ట సత్యం, చిమడబోయిన వెంకటేశ్వరరావు, సాయిల సత్యనారాయణ, శ్రీను, ముత్యాల రావు, హుస్సేన్, పోలిన నాగేశ్వరరావు, శంకర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

 Don't Miss this News !