+91 95819 05907

జర్నలిస్టు శంకర్ గౌడ్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి

*భద్రాద్రి కొత్తగూడెం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: జర్నలిస్ట్ శంకర్ గౌడ్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భద్రాద్రి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్ డిమాండ్ చేశారు. ప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న కారణంతో జర్నలిస్టు శంకర్ పై దాడి చేయడం సరికాదని అన్నారు. గురువారం రాత్రి జర్నలిస్టు శంకర్ పై హత్యాయత్నం జరిగిందని, చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున రావడంతో దుండగులు పారిపోయారని లేకపోతే జర్నలిస్టు శంకర్ ను హత్య చేసే వారిని అన్నారు. మీడియాకు స్వాతంత్ర్యం ఉండాలని భయపడి పని చేసే పరిస్థితిలో మీడియా ఉంటే అది సమాజానికి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. జర్నలిస్టులు చేసే విమర్శలను ప్రభుత్వాలు స్వీకరించాలి ఆ విమర్శలు నచ్చకపోతే ప్రతి విమర్శలు చేయాలి అంతేగాని భౌతిక దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అని అన్నారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని, జర్నలిస్టు శంకర్ చికిత్స కర్చులు ప్రభుత్వం భరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండు నెలల కాలంలో ఇప్పటికే ఐదుగురు జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరిగాయని అన్నారు. దాడులను అరికట్టాలని లేకపోతే అంతిమంగా అది ప్రభుత్వానికి కీడు చేస్తుందని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !