*భద్రాద్రి కొత్తగూడెం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: జర్నలిస్ట్ శంకర్ గౌడ్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భద్రాద్రి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్ డిమాండ్ చేశారు. ప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న కారణంతో జర్నలిస్టు శంకర్ పై దాడి చేయడం సరికాదని అన్నారు. గురువారం రాత్రి జర్నలిస్టు శంకర్ పై హత్యాయత్నం జరిగిందని, చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున రావడంతో దుండగులు పారిపోయారని లేకపోతే జర్నలిస్టు శంకర్ ను హత్య చేసే వారిని అన్నారు. మీడియాకు స్వాతంత్ర్యం ఉండాలని భయపడి పని చేసే పరిస్థితిలో మీడియా ఉంటే అది సమాజానికి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. జర్నలిస్టులు చేసే విమర్శలను ప్రభుత్వాలు స్వీకరించాలి ఆ విమర్శలు నచ్చకపోతే ప్రతి విమర్శలు చేయాలి అంతేగాని భౌతిక దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అని అన్నారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని, జర్నలిస్టు శంకర్ చికిత్స కర్చులు ప్రభుత్వం భరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండు నెలల కాలంలో ఇప్పటికే ఐదుగురు జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరిగాయని అన్నారు. దాడులను అరికట్టాలని లేకపోతే అంతిమంగా అది ప్రభుత్వానికి కీడు చేస్తుందని హెచ్చరించారు.









