+91 95819 05907

ఎమ్మెల్యే మృతి ఘటన లో ట్విస్ట్:పీ ఏ పైన కేసు నమోదు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం విధితమే. ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ ఆకాష్ పై నందిత సోదరి నివేదిత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణమయ్యారని సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత, కుటుంబ సభ్యులు పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లి పూజలు చేయించినట్లు సమాచారం.తిరుగు ప్రయాణం లో శుక్రవారం తెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ కు ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు ఎమ్మెల్యే నందిత పయనం ఐనట్లు..నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపిఆకాష్ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఆకాష్ కూడా
తీవ్ర గాయలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు.ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుంది.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉంది – సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఏది ఏమైనప్పటికీ అతివేగం ఒక యువ మహిళా ఎమ్మెల్యే ప్రాణాలకు కారణమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !