నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం విధితమే. ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ ఆకాష్ పై నందిత సోదరి నివేదిత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణమయ్యారని సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత, కుటుంబ సభ్యులు పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లి పూజలు చేయించినట్లు సమాచారం.తిరుగు ప్రయాణం లో శుక్రవారం తెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ కు ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు ఎమ్మెల్యే నందిత పయనం ఐనట్లు..నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపిఆకాష్ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఆకాష్ కూడా
తీవ్ర గాయలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు.ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుంది.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉంది – సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఏది ఏమైనప్పటికీ అతివేగం ఒక యువ మహిళా ఎమ్మెల్యే ప్రాణాలకు కారణమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
