+91 95819 05907

లైన్ క్లియర్ :సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్

లైన్ క్లియర్ :సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్
ఫలించిన డిప్యూటీ సీఎం కృషి
సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధ్య కుదిరిన ఒప్పందం
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
సింగరేణిని బలోపేతం చేసేందుకు తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల రెండవ బ్లాక్ 2 బొగ్గు గని కేటాయింపుకు పూర్తి అనుకూలత ఉందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. త్వరలో సింగరేణి కాలరీస్ కు కేంద్రం నుంచి బొగ్గు గని కేటాయింపుకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామన్నారు. తాజా గని కేటాయింపుతో సింగరేణిలో ప్రతి ఏడాది ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరగనుంది. 30 ఏళ్ల పాటు కొత్త గనిలో తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశం ఏర్పడింది. తాడిచర్ల బ్లాక్ 2 కొత్తగని ద్వారా 30 ఏళ్ల జీవితకాలంలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. సింగరేణికి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ లోను సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రుని డిప్యూటీ సీఎం కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం వెంట సింగరేణి కాలరీస్ చైర్మన్ బలరాం నాయక్, సిఎండి సయ్యద్ అలీ రిజ్వీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్. సింగరేణి డైరెక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

చిన్నారులకు ఆశీర్వచనాలు.

చిన్నారులకు ఆశీర్వచనాలు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగలవంచ గ్రామానికి చెందిన కంభం నరేష్ – కృష్ణవేణి దంపతుల అక్షయ, మైత్రేయి చిన్నారులకు పలువురు ఆశీర్వచనాలు అందించారు. ఈ

Read More »

వెలుగు మట్ల బాధితులలో అర్హులకు అండగా ఉంటాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి

Read More »

 Don't Miss this News !