+91 95819 05907

లైన్ క్లియర్ :సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్

లైన్ క్లియర్ :సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్
ఫలించిన డిప్యూటీ సీఎం కృషి
సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధ్య కుదిరిన ఒప్పందం
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
సింగరేణిని బలోపేతం చేసేందుకు తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల రెండవ బ్లాక్ 2 బొగ్గు గని కేటాయింపుకు పూర్తి అనుకూలత ఉందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. త్వరలో సింగరేణి కాలరీస్ కు కేంద్రం నుంచి బొగ్గు గని కేటాయింపుకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామన్నారు. తాజా గని కేటాయింపుతో సింగరేణిలో ప్రతి ఏడాది ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరగనుంది. 30 ఏళ్ల పాటు కొత్త గనిలో తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశం ఏర్పడింది. తాడిచర్ల బ్లాక్ 2 కొత్తగని ద్వారా 30 ఏళ్ల జీవితకాలంలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడింది. సింగరేణికి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ లోను సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రుని డిప్యూటీ సీఎం కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం వెంట సింగరేణి కాలరీస్ చైర్మన్ బలరాం నాయక్, సిఎండి సయ్యద్ అలీ రిజ్వీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్. సింగరేణి డైరెక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !