+91 95819 05907

ఎన్నికల సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

– స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పీవో ప్రతిక్ జైన్

నేటి గదర్ న్యూస్, మే 05, భద్రాద్రి కొత్తగూడెం :

రోజురోజుకి ఎండలు ముదురుతున్నందున ఎంపీ ఎన్నికలలో పాల్గొననున్న సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించాలని 110-(ST) అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం మణుగూరు పట్టణం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తీసుకొని వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలో శ్యామ్యానాలు, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, సమయానుకూలంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది వారి యొక్క సామాగ్రిని సరిచూసుకోవడానికి ఇబ్బందులు కలగకుండా 11వ తేదీ సాయంత్రం వరకు పాఠశాల ఆవరణలో 1500 కుర్చీలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని తహసిల్దార్ కు సూచించారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారు వెళ్లే బస్సులలో మంచినీటి బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అన్నారు. ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలింగ్ సిబ్బంది వెళ్లేటప్పుడు తప్పనిసరిగా భోజనాలు చేసి వెళ్లేలా భోజనాలు కూడా సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ నాగరాజు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం కలెక్టరేట్ లోని

Read More »

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు.. * మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు * రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం *

Read More »

కిలారు మనోహర్ కు సన్మానం.

కిలారు మనోహర్ కు సన్మానం. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ

Read More »

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు నేటి గదర్:దంతాలపల్లి

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

 Don't Miss this News !