+91 95819 05907

ఎన్నికల సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

– స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పీవో ప్రతిక్ జైన్

నేటి గదర్ న్యూస్, మే 05, భద్రాద్రి కొత్తగూడెం :

రోజురోజుకి ఎండలు ముదురుతున్నందున ఎంపీ ఎన్నికలలో పాల్గొననున్న సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించాలని 110-(ST) అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం మణుగూరు పట్టణం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తీసుకొని వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలో శ్యామ్యానాలు, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, సమయానుకూలంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది వారి యొక్క సామాగ్రిని సరిచూసుకోవడానికి ఇబ్బందులు కలగకుండా 11వ తేదీ సాయంత్రం వరకు పాఠశాల ఆవరణలో 1500 కుర్చీలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని తహసిల్దార్ కు సూచించారు. పోలింగ్ సిబ్బంది సామాగ్రి తీసుకొని వెళ్లేటప్పుడు వారు వెళ్లే బస్సులలో మంచినీటి బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అన్నారు. ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలింగ్ సిబ్బంది వెళ్లేటప్పుడు తప్పనిసరిగా భోజనాలు చేసి వెళ్లేలా భోజనాలు కూడా సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ నాగరాజు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వినూతన ఆలోచనలు… అభివృద్ధిలో దూసుకుపోతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

*కలెక్టర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి బాటలో…* *వివిధ రంగాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* *పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న

Read More »

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

 Don't Miss this News !